ETV Bharat / city

'అసమర్థతను కప్పిపుచ్చేందుకే తెదేపాపై ఆరోపణలు' - nakka anandh babu latest press meet news

ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. కరోనా సాయాన్ని వైకాపా నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారంగా మలుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

అసమర్థతను కప్పిపుచ్చేందుకే తెదేపాపై ఆరోపణలు
అసమర్థతను కప్పిపుచ్చేందుకే తెదేపాపై ఆరోపణలు
author img

By

Published : Apr 27, 2020, 10:12 PM IST

ప్రభుత్వంపై తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శలు

కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తెదేపాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు విమర్శించారు. కరోనాను పట్టించుకోకుండా ఎన్నికలు జరిపి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. వైకాపా నేతలు, మంత్రులు కరోనా సాయాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారని ఆరోపించారు. నగరిలో ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటే ఇతర ప్రాంతాల్లో... వైకాపా నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలంతా ఇళ్లకే పరిమితమై లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తున్నారని అన్నారు. విపత్కర సమయంలోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వంపై తెదేపా నేత నక్కా ఆనందబాబు విమర్శలు

కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే వైకాపా నేతలు తెదేపాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు విమర్శించారు. కరోనాను పట్టించుకోకుండా ఎన్నికలు జరిపి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. వైకాపా నేతలు, మంత్రులు కరోనా సాయాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారని ఆరోపించారు. నగరిలో ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకుంటే ఇతర ప్రాంతాల్లో... వైకాపా నేతలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలంతా ఇళ్లకే పరిమితమై లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తున్నారని అన్నారు. విపత్కర సమయంలోనూ వైకాపా నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'కరోనా వ్యాప్తికి అధికారుల నిర్లక్ష్యమే కారణం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.