ETV Bharat / city

HC: ఎక్సైజ్ ఆదాయం ఎస్క్రో ఖాతాకు మళ్లింపుపై పిటిషన్‌.. హైకోర్టులో విచారణ

author img

By

Published : Aug 9, 2021, 6:42 PM IST

ఎక్సైజ్ ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమంటూ వెలగపూడి రామకృష్ణ వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 18లోగా రీజాయిండర్ వేయాలని పిటిషనర్​ను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

High Court on the diversion petition to the Excise Revenue ESCRO Account
ఎక్సైజ్ ఆదాయం ఎస్క్రో ఖాతాకు మళ్లింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఎక్సైజ్ ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమంటూ వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరటంపై ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి రుణాలను తీసుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు. పిటిషనర్​ వాదనలపై స్పందించిన ఏజీ.. తాము కన్సాలిడేట్‌ ఫండ్‌కు నిధులు ఇస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ పెండింగ్​లో ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఆపేస్తున్నాయని.. పిటిషన్‌ను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈనెల 18లోగా రిజాయిండర్ వేయాలని పిటిషనర్​ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఎక్సైజ్ ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాకు మళ్లించటం రాజ్యాంగ విరుద్ధమంటూ వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరటంపై ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి రుణాలను తీసుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు. పిటిషనర్​ వాదనలపై స్పందించిన ఏజీ.. తాము కన్సాలిడేట్‌ ఫండ్‌కు నిధులు ఇస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ పెండింగ్​లో ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఆపేస్తున్నాయని.. పిటిషన్‌ను వెంటనే పరిష్కరించాలని హైకోర్టు ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈనెల 18లోగా రిజాయిండర్ వేయాలని పిటిషనర్​ను ఆదేశించింది. అనంతరం విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

CM Jagan: ఉపాధి పనులతో.. వక్ఫ్ భూముల చుట్టూ సరిహద్దు గోడల నిర్మాణం: సీఎం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.