ETV Bharat / city

సినిమా టికెట్​ రేట్లు సవరించినందుకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు: చిరంజీవి

author img

By

Published : Mar 7, 2022, 9:50 PM IST

సినిమా టికెట్ ధరలను సవరిస్తూ చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని సినీ నటుడు చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా టికెట్​ రేట్లు సవరించినందుకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు
సినిమా టికెట్​ రేట్లు సవరించినందుకు సీఎం జగన్​కు కృతజ్ఞతలు

సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటంపై సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారన్నారు. చిన్న చిత్రాలకు ఐదో షోకు అవకాశం కల్పించడం హర్షణీయమని వ్యాఖ్యనించారు. సీఎం జగన్ నిర్ణయం నిర్మాతలకు ఎంతో ఉపయోగపడే అంశంమన్నారు. మంత్రి పేర్ని నానితో పాటు సినిమా టికెట్లపై వేసిన కమిటీ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

"టికెట్లు రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు. చిన్న చిత్రాలకు ఐదో షో అవకాశం కల్పించడం హర్షణీయం. సీఎం నిర్ణయం నిర్మాతలకు ఎంతో ఉపయోగపడే అంశం. మంత్రి పేర్ని నాని, కమిటీ, అధికారులకు ధన్యవాదాలు." -చిరంజీవి, సినీ నటుడు

సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో..

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హీరో, డైరెక్టర్ రెన్యూమరేషన్ కాకుండా బడ్జెట్‌ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.

Cinema ticket rates in ap : రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు

  • నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
  • నగర పంచాయతీ ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
  • నగర పంచాయతీ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.70
  • నగరపంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో ధర రూ.100, రూ.250

మున్సిపాలిటీల్లో

  • మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
  • మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
  • మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.125, రూ.250

మున్సిపల్‌ కార్పొరేషన్లలో

  • మున్సిపల్‌ కార్పొరేషన్లలో నాన్‌ ఏసీ- కనిష్ఠ ‍ధర రూ.40
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.100
  • కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.150, రూ. 250

ఇదీ చదవండి

cabinet Meeting : రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్ధూ..!

సినిమా టికెట్ రేట్లు సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయటంపై సినీ నటుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారన్నారు. చిన్న చిత్రాలకు ఐదో షోకు అవకాశం కల్పించడం హర్షణీయమని వ్యాఖ్యనించారు. సీఎం జగన్ నిర్ణయం నిర్మాతలకు ఎంతో ఉపయోగపడే అంశంమన్నారు. మంత్రి పేర్ని నానితో పాటు సినిమా టికెట్లపై వేసిన కమిటీ, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

"టికెట్లు రేట్లు సవరిస్తూ జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు. చిన్న చిత్రాలకు ఐదో షో అవకాశం కల్పించడం హర్షణీయం. సీఎం నిర్ణయం నిర్మాతలకు ఎంతో ఉపయోగపడే అంశం. మంత్రి పేర్ని నాని, కమిటీ, అధికారులకు ధన్యవాదాలు." -చిరంజీవి, సినీ నటుడు

సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో..

రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినిమా టికెట్ల రేట్లు గరిష్ఠం రూ.250, కనిష్ఠం రూ.20 గా నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హీరో, డైరెక్టర్ రెన్యూమరేషన్ కాకుండా బడ్జెట్‌ ఆధారంగా చిత్రాలకు రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలయ్యాక కనీసం 10 రోజులు రేట్లు పెంచుకునేలా అవకాశం కల్పించింది. చిన్న సినిమాలకు 5 షోలు వేసుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20శాతం షూటింగ్ ఏపీలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని జీవోలో పేర్కొంది.

Cinema ticket rates in ap : రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు

  • నగర పంచాయతీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠం ధర రూ.20
  • నగర పంచాయతీ ఏసీ థియేటర్లు కనిష్ఠ ధర రూ.50
  • నగర పంచాయతీ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.70
  • నగరపంచాయతీల్లో మల్టీప్లెక్స్‌ల్లో ధర రూ.100, రూ.250

మున్సిపాలిటీల్లో

  • మున్సిపాలిటీల్లో నాన్‌ ఏసీ- కనిష్ఠ ధర రూ.30
  • మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లు- కనిష్ఠ ధర రూ.60
  • మున్సిపాలిటీల్లో స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠ ధర రూ. 80
  • మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.125, రూ.250

మున్సిపల్‌ కార్పొరేషన్లలో

  • మున్సిపల్‌ కార్పొరేషన్లలో నాన్‌ ఏసీ- కనిష్ఠ ‍ధర రూ.40
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏసీ థియేటర్లు కనిష్ఠ రూ.70
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పెషల్‌ థియేటర్లు కనిష్ఠం రూ.100
  • కార్పొరేషన్‌ మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ.150, రూ. 250

ఇదీ చదవండి

cabinet Meeting : రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్ధూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.