ETV Bharat / city

జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.6వేల 421 కోట్లు కేటాయింపు

author img

By

Published : May 29, 2021, 6:37 AM IST

Updated : May 29, 2021, 9:11 AM IST

జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో రూ. 6 వేల 421 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. జాతీయ రహదారులకు పెద్దఎత్తున నిధులు కేటాయింపుతో భూ సేకరణ సహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

HIGHWAYS
HIGHWAYS

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో రూ. 6 వేల 421 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. 2021-22 ఏడాది వార్షిక ప్రణాళికను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ఆమోదించింది. 2019-20 ఏడాదిలో కేవలం రూ. 267 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. సీఎం జగన్ వినతితో అదే ఏడాది కేటాయింపులను సవరించి పెంచింది.

2019-20 ఏడాదిలో రాష్ట్రానికి రూ.1830 కోట్లు కేటాయించారు. 2020-21లో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 2 వేల 702 కోట్లను కేంద్రం కేటాయించింది. 2021-22 ఏడాదికి రాష్ట్రానికి మూడింతలు కేటాయింపులు జరిపింది. ఈ ప్రణాళిక కింద ప్రతిపాదించిన పనులను రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బి విభాగానికి చెందిన జాతీయ రహదారుల విభాగం తీసుకుంటుంది. జాతీయ రహదారులకు పెద్దఎత్తున నిధులు కేటాయింపుతో భూ సేకరణ సహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది వార్షిక ప్రణాళికలో రూ. 6 వేల 421 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. 2021-22 ఏడాది వార్షిక ప్రణాళికను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ(Ministry of Road Transport and Highways) ఆమోదించింది. 2019-20 ఏడాదిలో కేవలం రూ. 267 కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది. సీఎం జగన్ వినతితో అదే ఏడాది కేటాయింపులను సవరించి పెంచింది.

2019-20 ఏడాదిలో రాష్ట్రానికి రూ.1830 కోట్లు కేటాయించారు. 2020-21లో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 2 వేల 702 కోట్లను కేంద్రం కేటాయించింది. 2021-22 ఏడాదికి రాష్ట్రానికి మూడింతలు కేటాయింపులు జరిపింది. ఈ ప్రణాళిక కింద ప్రతిపాదించిన పనులను రాష్ట్రంలోని ఆర్‌అండ్‌బి విభాగానికి చెందిన జాతీయ రహదారుల విభాగం తీసుకుంటుంది. జాతీయ రహదారులకు పెద్దఎత్తున నిధులు కేటాయింపుతో భూ సేకరణ సహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి..

వారం రోజుల తరువాత కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య

Last Updated : May 29, 2021, 9:11 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.