ETV Bharat / city

దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి

author img

By

Published : Sep 19, 2020, 5:36 PM IST

తితిదే ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రహస్య అజెండా ఉందనేలా ఛైర్మన్ వ్యాఖ్యలున్నాయని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో దేవాలయాల డబ్బును ఖజానాకు మళ్లించే ఆలోచనలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి
దేవాలయాలపై దాడులు రహస్య అజెండాలో భాగమే: అమర్నాథ్ రెడ్డి

మత కల్లోలాలు రెచ్చగొట్టి.. గొడవలు రేపే కుట్రలో భాగంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అమర్నాథ్​ రెడ్డి ధ్వజమెత్తారు. దేవుడి డబ్బు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం రహస్య అజెండాలో భాగమేనని విమర్శించారు. మంత్రులు చేసే వ్యాఖ్యలే ఈ అనుమానాలకు తావిస్తోందన్న అమర్నాథ్ రెడ్డి... తప్పించుకోవాలని చూడటం, తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం కఠినంగా ఉంటే ఈ తరహా దాడులు ఖచ్చితంగా జరగవని స్పష్టం చేశారు.

మత కల్లోలాలు రెచ్చగొట్టి.. గొడవలు రేపే కుట్రలో భాగంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అమర్నాథ్​ రెడ్డి ధ్వజమెత్తారు. దేవుడి డబ్బు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటం రహస్య అజెండాలో భాగమేనని విమర్శించారు. మంత్రులు చేసే వ్యాఖ్యలే ఈ అనుమానాలకు తావిస్తోందన్న అమర్నాథ్ రెడ్డి... తప్పించుకోవాలని చూడటం, తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వం కఠినంగా ఉంటే ఈ తరహా దాడులు ఖచ్చితంగా జరగవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.