ETV Bharat / city

జలాశయాలకు వరద పోటు.. తెరుచుకున్న గేట్లు..

author img

By

Published : Aug 12, 2022, 12:52 PM IST

Updated : Aug 12, 2022, 1:38 PM IST

FLOODS: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్​ ప్రస్తుత నీటిమట్టం 15 అడుగులకు చేరింది. దీంతో.. సముద్రంలోకి 14 లక్షల 70 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

DHAVALESWARAM
DHAVALESWARAM

DHAVALESWARAM: గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం వద్ద అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి పంట కాల్వలకు 7 వేల 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 14 లక్షల 70 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

SRISAILAM: శ్రీశైలం జలశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్​కు వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 213.40 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 46,123 క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేస్తున్నారు.

PULICHINTALA PROJECT: పులిచింతల ప్రాజెక్ట్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్​ జలాశయం నుంచి 3.89 లక్షల క్యూసెక్కుల నీటికి దిగువకు వదలడంతో 17 గేట్లు ఎత్తి 4.36 లక్షల క్యూసెక్కుల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. పులిచింతలకు వరద పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

KONASEEMA FLOODS: కోనసీమ జిల్లాలో లోతట్టు లంక గ్రామాలను.. వరద నీరు చుట్టుముట్టింది. అయినవిల్లి మండలం ఎదురుబీడె, పి.గన్నవరం మండలం జి.పెదపూడి, చాకలిపాలెం, మామిడి కుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్వేలు వరద ముంపులో ఉన్నాయి. కె.ఏనుగుపల్లి లంక, శివాయలంక, పుచ్చలంక, మానేపల్లి పల్లిపాలెంలో రోడ్లు నీట మునిగాయి. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లలోతు నీళ్లలోనే ప్రమాదకరంగా రోడ్లు దాటుతున్నారు.

DHAVALESWARAM: గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. రాజమహేంద్రవరం వద్ద అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి పంట కాల్వలకు 7 వేల 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 14 లక్షల 70 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

SRISAILAM: శ్రీశైలం జలశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్​కు వదులుతున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 213.40 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 46,123 క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేస్తున్నారు.

PULICHINTALA PROJECT: పులిచింతల ప్రాజెక్ట్​కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్​ జలాశయం నుంచి 3.89 లక్షల క్యూసెక్కుల నీటికి దిగువకు వదలడంతో 17 గేట్లు ఎత్తి 4.36 లక్షల క్యూసెక్కుల నీరును అధికారులు దిగువకు విడుదల చేశారు. పులిచింతలకు వరద పోటెత్తడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

KONASEEMA FLOODS: కోనసీమ జిల్లాలో లోతట్టు లంక గ్రామాలను.. వరద నీరు చుట్టుముట్టింది. అయినవిల్లి మండలం ఎదురుబీడె, పి.గన్నవరం మండలం జి.పెదపూడి, చాకలిపాలెం, మామిడి కుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్వేలు వరద ముంపులో ఉన్నాయి. కె.ఏనుగుపల్లి లంక, శివాయలంక, పుచ్చలంక, మానేపల్లి పల్లిపాలెంలో రోడ్లు నీట మునిగాయి. రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లలోతు నీళ్లలోనే ప్రమాదకరంగా రోడ్లు దాటుతున్నారు.

Last Updated : Aug 12, 2022, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.