ETV Bharat / city

'చంద్రబాబు ఎవరో చెప్పడానికి జగన్​కు ఇది చాలు'

author img

By

Published : Sep 7, 2020, 5:29 AM IST

ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ మొదటి స్థానంలో నిలవడానికి చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని మాజీమంత్రి దేవినేని ఉమా, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షించాయని వివరించారు. చంద్రబాబు ఎవరో చెప్పడానికి జగన్​కు ఇది చాలన్నారు.

TDP Leaders Comments On Chandrababu Over EODB Rank
'చంద్రబాబు ఎవరో చెప్పడానికి జగన్​కు ఇది చాలు'

దార్శనికతకు, నిబద్ధతకు, పనితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తెదేపా అధినేత చంద్రబాబు విధానాలు కొనసాగించి ఉంటే... ఏపీ ఎప్పటికీ నంబర్ వన్నేనని మాజీమంత్రి దేవినేని ఉమా తేల్చిచెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఏపీ మొదటిస్థానం వచ్చిందని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఏపీ ఘనత సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరో చెప్పడానికి జగన్​కు ఇది చాలని స్పష్టం చేశారు.

TDP Leaders Comments On Chandrababu Over EODB Rank
దేవినేని ఉమా ట్వీట్

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కృషివల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్​లో ఏపీ తొలిస్థానంలో నిలిచిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలు, చేపట్టిన సంస్కరణలు, పారదర్శక విధానాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. 2018-2019 ఏడాదికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో రాష్ట్రానికి తొలిస్థానం రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధి దిశగా చొరవ చూపాలని హితువు పలికారు.

ఇదీ చదవండీ... మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదు: పేర్ని నాని

దార్శనికతకు, నిబద్ధతకు, పనితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తెదేపా అధినేత చంద్రబాబు విధానాలు కొనసాగించి ఉంటే... ఏపీ ఎప్పటికీ నంబర్ వన్నేనని మాజీమంత్రి దేవినేని ఉమా తేల్చిచెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఏపీ మొదటిస్థానం వచ్చిందని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది ఏపీ ఘనత సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎవరో చెప్పడానికి జగన్​కు ఇది చాలని స్పష్టం చేశారు.

TDP Leaders Comments On Chandrababu Over EODB Rank
దేవినేని ఉమా ట్వీట్

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కృషివల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్​లో ఏపీ తొలిస్థానంలో నిలిచిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలు, చేపట్టిన సంస్కరణలు, పారదర్శక విధానాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. 2018-2019 ఏడాదికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో రాష్ట్రానికి తొలిస్థానం రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధి దిశగా చొరవ చూపాలని హితువు పలికారు.

ఇదీ చదవండీ... మీటర్ల ఏర్పాటుతో ఏ ఒక్క రైతుకూ నష్టం వాటిల్లదు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.