ETV Bharat / city

కోనసీమ విధ్వంసానికి నిరసనగా.. గుంటూరులో దళిత, గిరిజన సంఘాల ఆందోళన - కోనసీమ విధ్యంసంపై గుంటూరులో దళిత గిరిజన సంఘాల ఆందోళన

కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసాన్ని నిరసిస్తూ గుంటూరులో దళిత, గిరిజన సంఘాలు ఆందోళన దిగాయి. అంబేద్కర్ వంటి మహనీయుని పేరు పెట్టడాన్ని నిరసించటం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Dalit and tribal communities protest
దళిత, గిరిజన సంఘాలు ఆందోళన
author img

By

Published : May 25, 2022, 2:27 PM IST

కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసాన్ని నిరసిస్తూ గుంటూరులో దళిత, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. లాడ్జి సెంటర్​లోని అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పటంతో పోలీసులు అనుమతించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ వంటి మహనీయుని పేరు పెట్టడాన్ని నిరసించటం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరుని కొత్త జిల్లాకు కొనసాగించాలని కోరారు.

కోనసీమ జిల్లాలో జరిగిన విధ్వంసాన్ని నిరసిస్తూ గుంటూరులో దళిత, గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. లాడ్జి సెంటర్​లోని అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయితే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పటంతో పోలీసులు అనుమతించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ వంటి మహనీయుని పేరు పెట్టడాన్ని నిరసించటం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం సృష్టించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరుని కొత్త జిల్లాకు కొనసాగించాలని కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.