ETV Bharat / city

కేంద్ర మంత్రి పీయూష్​‌ గోయల్​కు ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ

author img

By

Published : Nov 9, 2020, 8:51 PM IST

రేషన్‌ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్​‌ గోయల్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి సోమవారం లేఖ రాశారు.

VIJAYSAIREDDY
VIJAYSAIREDDY

రేషన్‌ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్​‌ గోయల్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు.

ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు నగదు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉందని.. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేయాలన్నారు. 2020-21 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

రేషన్‌ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్​‌ గోయల్‌ను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు.

ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు నగదు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉందని.. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేయాలన్నారు. 2020-21 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి వివరించారు. సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

వీర జవాను ప్రాణత్యాగం వెలకట్టలేనిది : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.