ETV Bharat / city

protest on job calendar: జాబ్ క్యాలెండర్​పై తెదేపా నిరసనలు.. అరెస్టులు

author img

By

Published : Jul 19, 2021, 7:43 PM IST

చలో తాడేపల్లి(chalo tadepalli)కి బయలుదేరిన తెదేపా, టీఎన్​ఎస్​ఎఫ్ నాయకుల అరెస్టులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరికొంత మంది నేతలను గృహ నిర్బంధం(house arrest) చేశారు. విద్యార్థులను అరెస్టు చేసి వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారని.. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని పలువురు పార్టీ శ్రేణులు స్పష్టంచేశారు.

tdp protests on the calendar
క్యాలండర్​పై తెదేపా నిరసనలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ.. విద్యార్ధి సంఘాలు తాడేపల్లిలోని సీఎం నివాసం ముట్టడి(chalo tadepalli)కి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులకు సంఘీభావంగా బయలుదేరిన గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్ కుమార్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్బంధిస్తారని శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడం సరికాదని.. ప్రజా సమస్యల కోసం పోరాడే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు భయపడేది లేదన్న ఆయన.. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందన్నారు.

అందుకే ముఖ్యమంత్రి పోలవరం పారిపోయారు: జీవీ ఆంజనేయులు

ఉద్యోగాల కోసం యువత చేసిన తిరుగుబాటుకు భయపడిన ముఖ్యమంత్రి జగన్(cm jagan)​.. ప్రాజెక్టు పరిశీలన పేరుతో పోలవరం పారిపోయారని నర్సరావుపేట పార్లమెంట్ తెదేపా(tdp leader gv Anjaneyulu) అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. 2.30లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేకపోతే రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.

" రెండేళ్లలో 2శాతం పోలవరం పనులు పూర్తి చేయని ముఖ్యమంత్రి.. ఫొటోలకు పోజులివ్వటానికే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. అక్కడ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు చేసిన వాగ్ధానాలను విస్మరించి వారి కళ్లల్లో కారం కొట్టారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధాలు చేయటాన్ని ఖండిస్తున్నాం. ప్రజా తిరుగుబాటుకు భయపడే ఇంటి చుట్టూ 144సెక్షన్ పెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. చంద్రబాబు ఇచ్చిన రూ.2వేల నిరుద్యోగ భృతిని రద్దు చేయటం దుర్మార్గం. సొంత సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయ ఉద్యోగాలు ఇచ్చి ఇతర వర్గాలన్నింటినీ అవమానపరుస్తున్నారు. ప్రైవేటు రంగంలోనూ పరిశ్రమలు తరలిపోయేలా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ భృతి ఇచ్చిన చంద్రబాబునే కాల్చిచంపాలన్న జగన్ రెడ్డిని ఇప్పుడేం చేయాలి. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని సీఎం వెంటనే గద్దె దిగాలి." అని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ భవన్​ వద్ద బలవంతపు అరెస్టులు

చలో తాడేపల్లి నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(ntr bhavan) వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీస్​ నుంచి బయటకొచ్చిన పలువురు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిరుద్యోగులను మోసం చేశారు

ముఖ్యమంత్రి జగన్​ ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. చలో తాడేపల్లి సందర్భంగా నిరుద్యోగులు, తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధం చేసి తీవ్ర ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి జగన్​ పాలనలో ప్రజాప్రతినిధులను దొంగలు, దోపిడీదారుల వలే చూస్తున్నారని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడటానికి తెదేపా నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కళా వెంకట్రావు

ముఖ్యమంత్రి జగన్​ గారు.. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జాబ్ క్యాలెండర్ రద్దు కోరుతూ.. నిరుద్యోగులకు మద్దతుగా నిరసన(protest) ప్రదర్శన నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్​ను తక్షణమే రద్దు చేసి రాష్ట్రంలోని మొత్తం పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని పలికిన ముఖ్యమంత్రి.. ఇప్పుడూ ఆ సంగతి మరిచిపోయి తన కేసుల కోసం కేంద్రం ముందు మోకరిల్లారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు: దేవినేని

టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని(devinenu uma) ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారంటూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​కు పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన ఆయన.. అరెస్టులను ఖండించారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా అరెస్టులు కొనసాగుతున్నాయని విమర్శించారు. విద్యార్థులను అరెస్టులు చేసి వారి భవిష్యత్​తో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తం ఖాళీలతో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి: నక్కా ఆనంద్ బాబు

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. సీఎం ఇంటి ముట్టడిలో భాగంగా అరెస్టు అయిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పరామర్శించేందుకు స్టేషన్​కు వెళ్లారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయటమే కాకుండా.. వారిని పరామర్శించేందుకు వచ్చిన తమపై ఆంక్షలు విధించటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో 2లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తక్షణం వాటిని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల ఆగ్రహం చవిచూసే రోజులు దగ్గర్లలోనే..

విజయవాడ భవానీపురంలో పోలీసుల అదుపులో ఉన్న టీఎన్​ఎస్ విద్యార్థి సంఘం నాయకులను కేశినేని శ్వేత పరామర్శించారు. జాబ్ లెస్​ క్యాలెండర్‌(jobless calendar) విడుదల చేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. సీఎంకు తమ గోడును వినిపించుకోవడానికి తాడేపల్లి వెళ్తున్న యువత, నిరుద్యోగులను అరెస్టు చేయటం హేయమైన చర్య అన్నారు.

మహిళలు, యువతులకు ఎలాంటి రక్షణ లేని ప్రభుత్వం 'వైకాపా ప్రభుత్వం' అని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రే దొంగలను తీసుకొచ్చినట్లు విద్యార్థులను స్టేషన్లకు పట్టుకెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహం చవిచూసే రోజులు వైకాపా ప్రభుత్వానికి దగ్గర్లలోనే ఉన్నాయని విమర్శించారు.

ఇదీ చదవండి..: PAWANKALYAN: నమ్మి అధికారం కట్టబెడితే.. నయవంచన: పవన్​ కల్యాణ్​

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ.. విద్యార్ధి సంఘాలు తాడేపల్లిలోని సీఎం నివాసం ముట్టడి(chalo tadepalli)కి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నాయకులకు సంఘీభావంగా బయలుదేరిన గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్ కుమార్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్బంధిస్తారని శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడం సరికాదని.. ప్రజా సమస్యల కోసం పోరాడే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు భయపడేది లేదన్న ఆయన.. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందన్నారు.

అందుకే ముఖ్యమంత్రి పోలవరం పారిపోయారు: జీవీ ఆంజనేయులు

ఉద్యోగాల కోసం యువత చేసిన తిరుగుబాటుకు భయపడిన ముఖ్యమంత్రి జగన్(cm jagan)​.. ప్రాజెక్టు పరిశీలన పేరుతో పోలవరం పారిపోయారని నర్సరావుపేట పార్లమెంట్ తెదేపా(tdp leader gv Anjaneyulu) అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. 2.30లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేకపోతే రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.

" రెండేళ్లలో 2శాతం పోలవరం పనులు పూర్తి చేయని ముఖ్యమంత్రి.. ఫొటోలకు పోజులివ్వటానికే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. అక్కడ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు చేసిన వాగ్ధానాలను విస్మరించి వారి కళ్లల్లో కారం కొట్టారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధాలు చేయటాన్ని ఖండిస్తున్నాం. ప్రజా తిరుగుబాటుకు భయపడే ఇంటి చుట్టూ 144సెక్షన్ పెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. చంద్రబాబు ఇచ్చిన రూ.2వేల నిరుద్యోగ భృతిని రద్దు చేయటం దుర్మార్గం. సొంత సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయ ఉద్యోగాలు ఇచ్చి ఇతర వర్గాలన్నింటినీ అవమానపరుస్తున్నారు. ప్రైవేటు రంగంలోనూ పరిశ్రమలు తరలిపోయేలా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ భృతి ఇచ్చిన చంద్రబాబునే కాల్చిచంపాలన్న జగన్ రెడ్డిని ఇప్పుడేం చేయాలి. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని సీఎం వెంటనే గద్దె దిగాలి." అని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ భవన్​ వద్ద బలవంతపు అరెస్టులు

చలో తాడేపల్లి నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(ntr bhavan) వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆఫీస్​ నుంచి బయటకొచ్చిన పలువురు కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిరుద్యోగులను మోసం చేశారు

ముఖ్యమంత్రి జగన్​ ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. చలో తాడేపల్లి సందర్భంగా నిరుద్యోగులు, తెదేపా నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధం చేసి తీవ్ర ఇబ్బందికి గురిచేశారని మండిపడ్డారు. పోలీసులు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి జగన్​ పాలనలో ప్రజాప్రతినిధులను దొంగలు, దోపిడీదారుల వలే చూస్తున్నారని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడటానికి తెదేపా నాయకులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ: కళా వెంకట్రావు

ముఖ్యమంత్రి జగన్​ గారు.. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జాబ్ క్యాలెండర్ రద్దు కోరుతూ.. నిరుద్యోగులకు మద్దతుగా నిరసన(protest) ప్రదర్శన నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్​ను తక్షణమే రద్దు చేసి రాష్ట్రంలోని మొత్తం పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని పలికిన ముఖ్యమంత్రి.. ఇప్పుడూ ఆ సంగతి మరిచిపోయి తన కేసుల కోసం కేంద్రం ముందు మోకరిల్లారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు: దేవినేని

టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల అరెస్టుపై మాజీ మంత్రి దేవినేని(devinenu uma) ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారంటూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​కు పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన ఆయన.. అరెస్టులను ఖండించారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా అరెస్టులు కొనసాగుతున్నాయని విమర్శించారు. విద్యార్థులను అరెస్టులు చేసి వారి భవిష్యత్​తో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తం ఖాళీలతో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి: నక్కా ఆనంద్ బాబు

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు.. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. సీఎం ఇంటి ముట్టడిలో భాగంగా అరెస్టు అయిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పరామర్శించేందుకు స్టేషన్​కు వెళ్లారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయటమే కాకుండా.. వారిని పరామర్శించేందుకు వచ్చిన తమపై ఆంక్షలు విధించటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో 2లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. తక్షణం వాటిని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల ఆగ్రహం చవిచూసే రోజులు దగ్గర్లలోనే..

విజయవాడ భవానీపురంలో పోలీసుల అదుపులో ఉన్న టీఎన్​ఎస్ విద్యార్థి సంఘం నాయకులను కేశినేని శ్వేత పరామర్శించారు. జాబ్ లెస్​ క్యాలెండర్‌(jobless calendar) విడుదల చేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. సీఎంకు తమ గోడును వినిపించుకోవడానికి తాడేపల్లి వెళ్తున్న యువత, నిరుద్యోగులను అరెస్టు చేయటం హేయమైన చర్య అన్నారు.

మహిళలు, యువతులకు ఎలాంటి రక్షణ లేని ప్రభుత్వం 'వైకాపా ప్రభుత్వం' అని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రే దొంగలను తీసుకొచ్చినట్లు విద్యార్థులను స్టేషన్లకు పట్టుకెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహం చవిచూసే రోజులు వైకాపా ప్రభుత్వానికి దగ్గర్లలోనే ఉన్నాయని విమర్శించారు.

ఇదీ చదవండి..: PAWANKALYAN: నమ్మి అధికారం కట్టబెడితే.. నయవంచన: పవన్​ కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.