రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా.. 1,941 మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 424, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 25 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వివరాలు వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.
24 గంటల వ్యవధిలో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 11,809 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది.
ఇదీ చదవండి: