ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,941 కరోనా కేసులు... ఆరుగురు మృతి - కరోనా హెల్త్ బులెటిన్ 06.04.2021

గడచిన 24 గంటల్లో.. రాష్ట్రంలో 1,941 మందికి కొత్తగా కరోనా సోకింది. 835 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 11,809 మంది చికిత్స పొందుతున్నారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

new corona cases on april 6 2021, latest corona bulletin 06.04.2021
రాష్ట్రంలో తాజా కరోనా కేసులు, 06.04.2021 కరోనా కేసులు
author img

By

Published : Apr 6, 2021, 5:21 PM IST

new corona cases on april 6 2021, latest corona bulletin 06.04.2021
06.04.2021 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా.. 1,941 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయ్యింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 424, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 25 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.

24 గంటల వ్యవధిలో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 11,809 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

new corona cases on april 6 2021, latest corona bulletin 06.04.2021
06.04.2021 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 31,657 నమూనాలను పరీక్షించగా.. 1,941 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయ్యింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 424, పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 25 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,10,943కి చేరింది.

24 గంటల వ్యవధిలో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 11,809 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.