ETV Bharat / city

MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ

author img

By

Published : Jun 16, 2021, 3:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు. కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అప్పుల్లో ఏపీ కొట్టుమిట్టాడుతోందని లేఖలో పేర్కొన్నారు. స్థోమతకు మించి అప్పులు చేసి ఊబిలోకి పోయిందని వివరించారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారన్న రఘురామ... ఏపీఎస్‌డీసీకి ఆస్తులు బదలాయించి తనఖా కార్యక్రమం చేపట్టారని వివరించారు.

ఇప్పటికే రూ.10 వేల కోట్లు అప్పు...

ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి ఏపీఎస్‌డీసీ సంస్థ రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుందని రఘురామ మోదీకి రాసిన లేఖలో వివరించారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లులు గ్రూపు నుంచి భూములు వెనక్కి తీసుకుని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేశారన్న రఘురామకృష్ణరాజు... సుమారు రూ.35 వేల కోట్లకుపైగా అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

గాడితప్పింది...

2020లో సగటున ప్రతి నెలా సుమారు రూ.9226 కోట్లు అప్పు చేశారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఉచిత పథకాల కోసమే సుమారు రూ.13 వేల కోట్లు అప్పు చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని వ్యాఖ్యానించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని... ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ కోరారు. ప్రజా సంక్షేమ పథకాల ముసుగులో వ్యక్తిగత సంక్షేమం, స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధానం కనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చదవండీ... RaghuRama letter to Jagan: సీఎంకు ఏడో లేఖ రాసిన ఎంపీ రఘురామ!

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అప్పుల్లో ఏపీ కొట్టుమిట్టాడుతోందని లేఖలో పేర్కొన్నారు. స్థోమతకు మించి అప్పులు చేసి ఊబిలోకి పోయిందని వివరించారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారన్న రఘురామ... ఏపీఎస్‌డీసీకి ఆస్తులు బదలాయించి తనఖా కార్యక్రమం చేపట్టారని వివరించారు.

ఇప్పటికే రూ.10 వేల కోట్లు అప్పు...

ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి ఏపీఎస్‌డీసీ సంస్థ రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుందని రఘురామ మోదీకి రాసిన లేఖలో వివరించారు. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లులు గ్రూపు నుంచి భూములు వెనక్కి తీసుకుని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతోందని లేఖలో ప్రస్తావించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేశారన్న రఘురామకృష్ణరాజు... సుమారు రూ.35 వేల కోట్లకుపైగా అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

గాడితప్పింది...

2020లో సగటున ప్రతి నెలా సుమారు రూ.9226 కోట్లు అప్పు చేశారని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఉచిత పథకాల కోసమే సుమారు రూ.13 వేల కోట్లు అప్పు చేసిందని... రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పిందని వ్యాఖ్యానించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలని... ప్రజల ఆస్తులను కాపాడాలని రఘురామ కోరారు. ప్రజా సంక్షేమ పథకాల ముసుగులో వ్యక్తిగత సంక్షేమం, స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకునే విధానం కనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చదవండీ... RaghuRama letter to Jagan: సీఎంకు ఏడో లేఖ రాసిన ఎంపీ రఘురామ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.