ETV Bharat / city

ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటాం: మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Jan 27, 2021, 5:52 PM IST

ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామన్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021
minister peddireddy ramachandra reddy slams sec

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రాపకం కోసం నిమ్మగడ్డ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కొన్ని పార్టీలు హేళన చేస్తున్నాయన్నారు. పదవీ విరమణలోపు ఎన్నికలు పెట్టాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కమిషనర్ ఇంకా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎస్‌ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. చంద్రబాబు నామినేషన్లు ఎక్కువ వేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులపై ఎస్‌ఈసీ లేఖలను వెనక్కి పంపామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి

ద్వివేది, గిరిజా శంకర్‌పై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీకి తిప్పిపంపిన ప్రభుత్వం

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రాపకం కోసం నిమ్మగడ్డ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏకగ్రీవాలను కొన్ని పార్టీలు హేళన చేస్తున్నాయన్నారు. పదవీ విరమణలోపు ఎన్నికలు పెట్టాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల కమిషనర్ ఇంకా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎస్‌ఈసీ తీసుకునే క్రమశిక్షణా చర్యలను తర్వాత రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. చంద్రబాబు నామినేషన్లు ఎక్కువ వేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులపై ఎస్‌ఈసీ లేఖలను వెనక్కి పంపామని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి

ద్వివేది, గిరిజా శంకర్‌పై సెన్సూర్ ప్రొసీడింగ్స్‌ను ఎస్‌ఈసీకి తిప్పిపంపిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.