ETV Bharat / city

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలు

author img

By

Published : Mar 31, 2022, 5:43 AM IST

పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి.

left-wing parties
left-wing parties

పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండు చేశాయి. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐతోపాటు 8 వామపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘రాష్ట్ర ప్రజలపై రూ.4,300 కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం మోపడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసే ఈ టారిఫ్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 300 యూనిట్ల లోపు వినియోగించే వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున వారందరికీ పాత ఛార్జీలనే వర్తింప జేయాలి’ అని డిమాండు చేశాయి.

పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండు చేశాయి. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐతోపాటు 8 వామపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘రాష్ట్ర ప్రజలపై రూ.4,300 కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం మోపడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసే ఈ టారిఫ్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 300 యూనిట్ల లోపు వినియోగించే వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున వారందరికీ పాత ఛార్జీలనే వర్తింప జేయాలి’ అని డిమాండు చేశాయి.

ఇదీ చదవండి: "పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే.. భారీ ఉద్యమం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.