ETV Bharat / city

'రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు'

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని... కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని చెప్పారు.

author img

By

Published : Dec 31, 2019, 12:06 AM IST

bjp mp gvl narasimha rao
జీవీఎల్ నరసింహారావు
మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని... ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంపై పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగతం తప్ప... పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వీటితోపాటు సీఏఏ, ఎన్ఆర్​సీ అంశాలపై ఆయన స్పందించారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు సీఏఏ భారతీయులకు ఎలాంటి నష్టం కలిగించదన్నారు. పాకిస్థాన్ లాంటి దేశాల్లో మత వివక్షకు గురై అక్కడ ఇమడలేక... మన దేశానికి వచ్చే వారికి పౌరసత్వం కల్పించేదే సీఏఏ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లింలను కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'అమరావతి రైతుల కోసం నా ప్రాణాలను అడ్డువేస్తా'

మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని... ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశంపై పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగతం తప్ప... పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వీటితోపాటు సీఏఏ, ఎన్ఆర్​సీ అంశాలపై ఆయన స్పందించారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు సీఏఏ భారతీయులకు ఎలాంటి నష్టం కలిగించదన్నారు. పాకిస్థాన్ లాంటి దేశాల్లో మత వివక్షకు గురై అక్కడ ఇమడలేక... మన దేశానికి వచ్చే వారికి పౌరసత్వం కల్పించేదే సీఏఏ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముస్లింలను కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండి: 'అమరావతి రైతుల కోసం నా ప్రాణాలను అడ్డువేస్తా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.