Young Man Suicide Due to Online Betting in Medak: తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయణంపేట మండలం ప్రగతి ధర్మారంలో దారుణం చోటుచేసుకుంది. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి నష్టపోయిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భాను ప్రకాశ్ అనే 24 ఏళ్ల యువకుడు ఈ సీజన్లో ధాన్యం అమ్మగా వచ్చిన రూ. లక్షన్నరతో ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టాడు. నష్టాలు రావడంతో ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్- చివరికి ఆత్మహత్య
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 17, 2024, 5:36 PM IST
![పంట అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్- చివరికి ఆత్మహత్య Young Man Suicide Due to Online Betting in Medak](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2024/1200-675-21731537-thumbnail-16x9-online-betting.jpg?imwidth=3840)
Young Man Suicide Due to Online Betting in Medak: తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయణంపేట మండలం ప్రగతి ధర్మారంలో దారుణం చోటుచేసుకుంది. ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి నష్టపోయిన ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భాను ప్రకాశ్ అనే 24 ఏళ్ల యువకుడు ఈ సీజన్లో ధాన్యం అమ్మగా వచ్చిన రూ. లక్షన్నరతో ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టాడు. నష్టాలు రావడంతో ఈ నెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.