ETV Bharat / snippets

విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు- ఆగస్టు 15వరకు వేళల్లో మార్పులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 7:28 PM IST

Updated : Jun 11, 2024, 7:35 PM IST

trains cancelled
trains cancelled (ETV Bharat)

trains cancelled in andhra pradesh: విజయవాడ రైల్వే డివిజన్ లో కొనసాగుతున్న రైలు ట్రాక్ నిర్వహణ పనుల వల్ల పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వీటిని విజయవాడ శివారు లోని రామవరప్పాడు స్టేషన్ వరకే పరిమితం చేయనున్నారు. ట్రాక్ నిర్వహణ కారణంగా 11 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్ లో పొందుపరచారు.

trains cancelled in andhra pradesh: విజయవాడ రైల్వే డివిజన్ లో కొనసాగుతున్న రైలు ట్రాక్ నిర్వహణ పనుల వల్ల పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 24 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వీటిని విజయవాడ శివారు లోని రామవరప్పాడు స్టేషన్ వరకే పరిమితం చేయనున్నారు. ట్రాక్ నిర్వహణ కారణంగా 11 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్ లో పొందుపరచారు.

Last Updated : Jun 11, 2024, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.