No Confidence Motion in Boduppal Municipal Corporation : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగర పాలక కార్యాలయంలో కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకుగాను 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మిగిలిన సభ్యులు హాజరు కాలేదు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో నెగ్గిన అవిశ్వాసం - నూతన మేయర్గా అజయ్ యాదవ్ పేరు ఖరారు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 29, 2024, 3:25 PM IST
![బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో నెగ్గిన అవిశ్వాసం - నూతన మేయర్గా అజయ్ యాదవ్ పేరు ఖరారు Boduppal Municipal Corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/1200-675-21826026-thumbnail-16x9-boduppal.jpg?imwidth=3840)
ఈ సందర్భంగా మేడ్చల్ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డిలు మాట్లాడుతూ, బోడుప్పల్ కార్పొరేషన్లో మాజీమంత్రి మల్లారెడ్డి అరాచక పాలనకు తెరపడిందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో బోడుప్పల్ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. నూతన మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ పేరును ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పేరు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
No Confidence Motion in Boduppal Municipal Corporation : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి గౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగర పాలక కార్యాలయంలో కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకుగాను 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మిగిలిన సభ్యులు హాజరు కాలేదు.
ఈ సందర్భంగా మేడ్చల్ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డిలు మాట్లాడుతూ, బోడుప్పల్ కార్పొరేషన్లో మాజీమంత్రి మల్లారెడ్డి అరాచక పాలనకు తెరపడిందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో బోడుప్పల్ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందన్నారు. నూతన మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ పేరును ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పేరు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.