ETV Bharat / snippets

హజ్​ యాత్రలో 98మంది భారతీయులు మృతి- ఆ కారణంతోనే ఎక్కువగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 8:47 PM IST

Indians Death In Haj
Indians Death In Haj (Etv Bharat)

Indians Death In Hajj : హజ్‌ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు లక్షా 70 వేల మంది భారతీయులు మక్కాను సందర్శించినట్లు తెలిపిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌, హజ్‌ యాత్ర మే 9 నుంచి జులై 22 వరకూ జరగనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హజ్‌ యాత్రలో పాల్గొన్న భారతీయుల్లో ఇప్పటివరకూ 98 మంది మరణించినట్లు చెప్పిన ఆయన, వీరంతా వృద్ధాప్యం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడినట్లు వెల్లడించారు. 2023లో హజ్‌ యాత్ర సందర్భంగా 187 మంది భారతీయులు మృతి చెందినట్లు గుర్తుచేశారు.

Indians Death In Hajj : హజ్‌ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు లక్షా 70 వేల మంది భారతీయులు మక్కాను సందర్శించినట్లు తెలిపిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌, హజ్‌ యాత్ర మే 9 నుంచి జులై 22 వరకూ జరగనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హజ్‌ యాత్రలో పాల్గొన్న భారతీయుల్లో ఇప్పటివరకూ 98 మంది మరణించినట్లు చెప్పిన ఆయన, వీరంతా వృద్ధాప్యం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడినట్లు వెల్లడించారు. 2023లో హజ్‌ యాత్ర సందర్భంగా 187 మంది భారతీయులు మృతి చెందినట్లు గుర్తుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.