ETV Bharat / snippets

గుడిసెపై ఇసుక ట్రక్కు బోల్తా- ఒకే కుటుంబంలోని 8మంది స్పాట్​ డెడ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 8:54 AM IST

Sand Truck Overturned On Hut
Sand Truck Overturned On Hut (ANI)

Truck Overturned On Hut : ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీ జిల్లాలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు గుడిసెపై బోల్తాపడడం వల్ల ఈ విషాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్​తోపాటు క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, జిల్లాలోని మల్వాన్​ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి అవధేశ్ అలియాస్ బల్లా గుడిసెపై ఇసుక ట్రక్కు బోల్తా పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాలికకు చికిత్స కోసం పీహెచ్​సీలో చేర్పించారు.

Truck Overturned On Hut : ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయీ జిల్లాలో ఒక కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఇసుక లోడుతో వెళ్తున్న ట్రక్కు గుడిసెపై బోల్తాపడడం వల్ల ఈ విషాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్​తోపాటు క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, జిల్లాలోని మల్వాన్​ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి అవధేశ్ అలియాస్ బల్లా గుడిసెపై ఇసుక ట్రక్కు బోల్తా పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జేసీబీ సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాలికకు చికిత్స కోసం పీహెచ్​సీలో చేర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.