ETV Bharat / snippets

ఇంట్లో చెలరేగిన మంటలు- ఒకే ఫ్యామిలీలోని ఐదుగురు సజీవదహనం- కారణం అదేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 6:53 AM IST

Fire Accident In House
Fire Accident In House (ETV Bharat)

Fire Accident In House : ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని ఓ ఇంట్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బహ్తా హాజీపుర్​లో ఉన్న రెండంతస్తుల ఇంట్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండంతస్తుల ఇంట్లో నివాసముంటున్న వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు చెప్పారు.

Fire Accident In House : ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని ఓ ఇంట్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బహ్తా హాజీపుర్​లో ఉన్న రెండంతస్తుల ఇంట్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండంతస్తుల ఇంట్లో నివాసముంటున్న వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.