బుద్ధప్రసాద్​ భారీ మెజారిటీతో గెలుస్తారని చిరంజీవి ఆశాభావం - Mandali met Megastar Chiranjeevi

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 7:52 PM IST

thumbnail
చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన మండలి బుద్ధప్రసాద్ - మండలి భారీ మెజారిటీతో గెలుస్తారని మెగాస్టార్ ఆశాభావం (ETV Bharat)

Mandali Buddha Prasad Met Megastar Chiranjeevi : పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఘనంగా సత్కరించారు. మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ఎమ్యెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బుద్ధ ప్రసాద్​ భారీ మెజారిటితో గెలుస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ హీరో శ్రీకాంత్, మండలి కుమారుడు వెంకట్రామ్, అల్లుడు శీలం అశ్విన్ కుమార్ పాల్గోన్నారు.

అయితే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించారు. దీంతో ఆ నియోజకవర్గంలో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గట్టిగా ప్రయత్నించారు. దీనికోసం విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బుద్ధప్రసాద్‌తో పాటు పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన బుద్ధప్రసాద్‌కు ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్‌ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించింది. తరువాత ఆయనతో పవన్ మాట్లాడిన అనంతరం మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరారు. తరువాత టికెట్ కేటాయించారు. అయితే ఈ ఎన్నికల్లో మండలి భారీ మెజారిటీతో గెలుపొందుతారని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని మండలి బుద్ధ ప్రసాద్ కలిశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.