LIVE కృష్ణా జిల్లా పెనమలూరు ప్రజాగళం సభలో చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - Prajagalam Sabha - PRAJAGALAM SABHA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 8:20 PM IST
|Updated : Apr 7, 2024, 9:42 PM IST
Chandrababu Prajagalam Sabha Live: పెనమలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000కి ఇస్తే వైఎస్సార్సీపీ రూ.5వేలు చేసిందని, మిగిలిన రూ.4వేలు ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గపు ఇసుక విధానం వల్ల వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలకు తగ్గకుండా ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజాగళం సభ ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 7, 2024, 9:42 PM IST