ETV Bharat / state

రివర్స్​ టెండర్లతో జగన్​ సర్కార్​ హంగామా - పోలవరంపై వేల కోట్లు అదనపు భారం - Heavy Burden For Polavaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 7:26 AM IST

YSRCP Negligence Curse For Polavaram Project: గత ప్రభుత్వ అడ్డగోలు అంచనాలతో రూ.852 కోట్ల మేర గుత్తేదారుకు లబ్ధి చేకూరింది. రివర్స్ టెండర్‌ విధానాలు అంటూ హడావుడి చేయడంతో పోలవరంపై పెను భారం పడింది. ఒక్క ప్రధాన డ్యాంలోనే రూ.4,512 కోట్ల మేర భారం మోపింది జగన్‌ సర్కారు. గతంలో జరిగిన నష్టాల ఫలితంగా మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపించారు.

YSRCP Negligence Curse For Polavaram Project
YSRCP Negligence Curse For Polavaram Project (ETV Bharat)
పోలవరానికి శాపంలా జగన్​ సర్కారు అలసత్వం - వైఎస్సార్సీపీ అడ్డగోలు అంచనాలతో గుత్తేదారుకు లబ్ధి (ETV Bharat)

YSRCP Negligence Become Curse For Polavaram Project: రివర్స్ టెండర్‌ విధానాలు, ఆదా అంటూ హడావుడి చేసిన జగన్‌ సర్కారు పోలవరంపై పెను భారం మోపింది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. అంచనాలకు 11,704 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదనలు అందజేశారు. జగన్‌ ఐదు సంవత్సరాల పాలన పుణ్యాన ఒక్క ప్రధాన డ్యాంలోనే రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాలతో పోలవరం ప్రాజెక్టుపై పెను భారం పడింది. రివర్స్‌ టెండర్లతో రూ.628 కోట్ల ఆదా అంటూ అప్పట్లో జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. తీరా పోలవరంపై వేల కోట్ల భారానికి వైఎస్సార్సీపీ సర్కార్ కారణమైంది. నాటి నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం అంచనాలు రూ.11,704 కోట్ల 94 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సవరించిన అంచనాలను జలవనరుల శాఖ మదింపు చేస్తోంది.

ప్రధాన డ్యాంకు అనుసంధానంగా మరో 6 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ పనులు ఏవీ ఈ అంచనాల్లోకి రావు. కుడి, ఎడమ కాలువలు, భూసేకరణ, పునరావాసం ఇందులో చేరవు. ఈ లెక్కన జగన్‌ ప్రభుత్వంలో ఒక్క ప్రధాన డ్యాంలోనే ఏకంగా రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడినట్లైంది. ఈ అంచనాలపై ఏ స్థాయిలో కోత పడుతుందో చూడాలి.

వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు పెరిగాయి - పోలవరం నాశనమైంది: చంద్రబాబు - CM Chandrababu on Polavaram Project

2021 ఏప్రిల్‌ 19న జగన్‌ ప్రభుత్వం పోలవరంలో ప్రధాన డ్యాం అంచనాలను రూ.7,192 కోట్లకు సవరించింది. తర్వాత ప్రధాన డ్యాంలో భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో చేయాల్సిన పనుల పేరుతో రూ.2,022 కోట్లకు మరోసారి పాలనామోదం ఇచ్చింది. పని పరిమాణం పెరగడం వల్ల, ఇతరత్రా అనేక విషయాల్లోనూ ఒప్పందాల్లో మార్పులు చేస్తూ ఏకంగా అదనంగా వందల కోట్ల మేర అదనపు లభ్ధి కల్పించింది.

ఆ మొత్తం వేయి కోట్లు దాటిపోగా గతంలో సవరించిన అంచనాలకు, తాజాగా సవరించబోతున్న అంచనాలకు మధ్య కాలంలో 852 కోట్ల 39 లక్షల రూపాయల మేర ఒప్పంద ఉల్లంఘనలు, అదనపు పనులు చేర్చడం ద్వారా గుత్తేదారుకు అదనపు లబ్ధి చేకూర్చింది. ఇవి చీఫ్‌ ఇంజినీరు స్థాయిలోనే ఆమోదం పొందాయి. రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ, ప్రభుత్వ స్థాయికి వెళ్లలేదని సమాచారం. 852 కోట్ల మేర గుత్తేదారుకు కల్పించిన ప్రయోజనమూ తాజా అంచనాల పెంపులో ఒక భారీ మొత్తంగా మారింది. ఇవన్నీ కలిపి పోలవరంపై వేల కోట్ల భారాన్ని పెంచుతున్నాయి.

నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ - 6 ప్రాజెక్టుల పూర్తికి తొలి ప్రాధాన్యం - AP Govt Focus on Irrigation Project

పోలవరానికి శాపంలా జగన్​ సర్కారు అలసత్వం - వైఎస్సార్సీపీ అడ్డగోలు అంచనాలతో గుత్తేదారుకు లబ్ధి (ETV Bharat)

YSRCP Negligence Become Curse For Polavaram Project: రివర్స్ టెండర్‌ విధానాలు, ఆదా అంటూ హడావుడి చేసిన జగన్‌ సర్కారు పోలవరంపై పెను భారం మోపింది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. అంచనాలకు 11,704 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదనలు అందజేశారు. జగన్‌ ఐదు సంవత్సరాల పాలన పుణ్యాన ఒక్క ప్రధాన డ్యాంలోనే రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడింది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాలతో పోలవరం ప్రాజెక్టుపై పెను భారం పడింది. రివర్స్‌ టెండర్లతో రూ.628 కోట్ల ఆదా అంటూ అప్పట్లో జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. తీరా పోలవరంపై వేల కోట్ల భారానికి వైఎస్సార్సీపీ సర్కార్ కారణమైంది. నాటి నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం అంచనాలు రూ.11,704 కోట్ల 94 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సవరించిన అంచనాలను జలవనరుల శాఖ మదింపు చేస్తోంది.

ప్రధాన డ్యాంకు అనుసంధానంగా మరో 6 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ పనులు ఏవీ ఈ అంచనాల్లోకి రావు. కుడి, ఎడమ కాలువలు, భూసేకరణ, పునరావాసం ఇందులో చేరవు. ఈ లెక్కన జగన్‌ ప్రభుత్వంలో ఒక్క ప్రధాన డ్యాంలోనే ఏకంగా రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడినట్లైంది. ఈ అంచనాలపై ఏ స్థాయిలో కోత పడుతుందో చూడాలి.

వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు పెరిగాయి - పోలవరం నాశనమైంది: చంద్రబాబు - CM Chandrababu on Polavaram Project

2021 ఏప్రిల్‌ 19న జగన్‌ ప్రభుత్వం పోలవరంలో ప్రధాన డ్యాం అంచనాలను రూ.7,192 కోట్లకు సవరించింది. తర్వాత ప్రధాన డ్యాంలో భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో చేయాల్సిన పనుల పేరుతో రూ.2,022 కోట్లకు మరోసారి పాలనామోదం ఇచ్చింది. పని పరిమాణం పెరగడం వల్ల, ఇతరత్రా అనేక విషయాల్లోనూ ఒప్పందాల్లో మార్పులు చేస్తూ ఏకంగా అదనంగా వందల కోట్ల మేర అదనపు లభ్ధి కల్పించింది.

ఆ మొత్తం వేయి కోట్లు దాటిపోగా గతంలో సవరించిన అంచనాలకు, తాజాగా సవరించబోతున్న అంచనాలకు మధ్య కాలంలో 852 కోట్ల 39 లక్షల రూపాయల మేర ఒప్పంద ఉల్లంఘనలు, అదనపు పనులు చేర్చడం ద్వారా గుత్తేదారుకు అదనపు లబ్ధి చేకూర్చింది. ఇవి చీఫ్‌ ఇంజినీరు స్థాయిలోనే ఆమోదం పొందాయి. రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ, ప్రభుత్వ స్థాయికి వెళ్లలేదని సమాచారం. 852 కోట్ల మేర గుత్తేదారుకు కల్పించిన ప్రయోజనమూ తాజా అంచనాల పెంపులో ఒక భారీ మొత్తంగా మారింది. ఇవన్నీ కలిపి పోలవరంపై వేల కోట్ల భారాన్ని పెంచుతున్నాయి.

నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ - 6 ప్రాజెక్టుల పూర్తికి తొలి ప్రాధాన్యం - AP Govt Focus on Irrigation Project

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.