ETV Bharat / state

మందుబాబులకు అడ్డాలుగా ఉద్యాన వనాలు - వైఎస్సార్సీపీ పాలనలో నిర్లక్ష్యం- నేడు ఆహ్లాదానికి ఆటంకం - YSRCP Neglected Parks Modernization

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 4:33 PM IST

Updated : Aug 19, 2024, 6:13 PM IST

Neglect of Parks During YSRCP Regime : విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కరవైంది. వారాంతాలు, సెలవు రోజుల్లో బయటకు వెళ్లి సరదాగా కుటుంబంతో గడిపేందుకు ప్రత్యామ్నాయాల కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. పార్కులకు వెళ్దామంటే నిర్వహణ లేక అవి అధ్వానంగా మిగిలాయి. ఆయా కాలనీల్లో ఉద్యాన వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. వైఎస్సార్సీపీ జమానాలో అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యానికి నగర పార్కులు అస్తవ్యస్తంగా మారాయి.

neglect_of_parks_during_ysrcp_regime
neglect_of_parks_during_ysrcp_regime (ETV Bharat)

Neglect of Parks During YSRCP Regime : విజయవాడలో పలు పార్కులు కళాహీనంగా తయారయ్యాయి. నగరంలో 64 డివిజన్లలో మొత్తం 177 పార్కులు ఉన్నాయి. వీటిలో కొన్ని పార్కులు పిచ్చి మొక్కలు, అదుపు లేకుండా పెరిగిన గడ్డితో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఇంటిల్లిపాదీ పార్కుకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ కార్పొరేషన్‌ కేవలం కమర్షియల్ పార్కులపైనే దృష్టి పెట్టింది. రాఘవయ్య పార్కు, అంబేడ్కర్, రాజీవ్ గాంధీ, కేఎల్​రావు పార్కులను మాత్రమే ఆధునికీకరించారు. కాలనీల్లో ఉద్యానాలకు నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారు. పలు పార్కులు నిర్వహణ లేక అధ్వానంగా మారి బ్లేడు బ్యాచ్‌లకు ఆవాసాలయ్యాయి. పార్కుల నిర్వహణను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

People Facing Problems In Parks Due to Lack of Minimum Facilities : సెలవు రోజుల్లో కుటుంబంతో సరదాగా గడపడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో పార్కులన్నీ నిర్వీర్యమైపోయాయని వారు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకోవడానికు కూడా సరైన సదుపాయాలు లేకపోవడం దారుణమని అంటున్నారు. దాతలు ముందుకొచ్చి పార్కులను అభివృద్ది చేద్దామనుకున్నా వారికి ఏదో ఓ ఆటకం ఎదురవుతుందని ఆవేదన చెందుతున్నారు. పార్కు సురక్షితంగా ఉండడానికి పారిశుద్ద కార్మికులు కూడా లేకపోవడం దారణమన్నారు.

'చాలామంది దాతలు తమ స్థలాన్నే పార్కుల నిర్వహణ కోసం దానం చేశారు. అలాంటి పార్కులు సైతం నిర్వహణ లేక, దాతలే దగ్గరుండి పరిరక్షించాల్సి వస్తోంది. మొక్కలకు నీళ్లు పట్టేవాళ్లు లేరు. ప్రమాదకరమైన గడ్డి మొక్కలు ఎక్కువవుతున్నాయి. బల్లులు విరిగిపోయాయి. పెద్దలు కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి సరైన సౌరర్యాలు లేవు. శుభ్రం చేసేవాళ్లు, పార్కులో ఏం జరిగినా అడిగేవాళ్లు లేకపోవడం చాలా దుర్భరం.' -నాగేశ్వరరావు, విజయవాడ

YSRCP Has Neglected the Modernization of Parks in Vijayawada : పార్కుల్లో సమస్యలపై వీఎంసీ ఇప్పటికైనా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. పార్కుల చుట్టూ ప్రహరీలు నిర్మించి గేట్లు ఏర్పాటుతో పాటు చిన్నారులకు ఆటవస్తువులు సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధికి నోచని ఎన్టీఆర్‌ నెక్లెస్‌ రోడ్డు - అసాంఘిక కార్యకలాపాలకు నిలయం

విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు

Neglect of Parks During YSRCP Regime : విజయవాడలో పలు పార్కులు కళాహీనంగా తయారయ్యాయి. నగరంలో 64 డివిజన్లలో మొత్తం 177 పార్కులు ఉన్నాయి. వీటిలో కొన్ని పార్కులు పిచ్చి మొక్కలు, అదుపు లేకుండా పెరిగిన గడ్డితో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఇంటిల్లిపాదీ పార్కుకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ కార్పొరేషన్‌ కేవలం కమర్షియల్ పార్కులపైనే దృష్టి పెట్టింది. రాఘవయ్య పార్కు, అంబేడ్కర్, రాజీవ్ గాంధీ, కేఎల్​రావు పార్కులను మాత్రమే ఆధునికీకరించారు. కాలనీల్లో ఉద్యానాలకు నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారు. పలు పార్కులు నిర్వహణ లేక అధ్వానంగా మారి బ్లేడు బ్యాచ్‌లకు ఆవాసాలయ్యాయి. పార్కుల నిర్వహణను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

People Facing Problems In Parks Due to Lack of Minimum Facilities : సెలవు రోజుల్లో కుటుంబంతో సరదాగా గడపడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో పార్కులన్నీ నిర్వీర్యమైపోయాయని వారు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకోవడానికు కూడా సరైన సదుపాయాలు లేకపోవడం దారుణమని అంటున్నారు. దాతలు ముందుకొచ్చి పార్కులను అభివృద్ది చేద్దామనుకున్నా వారికి ఏదో ఓ ఆటకం ఎదురవుతుందని ఆవేదన చెందుతున్నారు. పార్కు సురక్షితంగా ఉండడానికి పారిశుద్ద కార్మికులు కూడా లేకపోవడం దారణమన్నారు.

'చాలామంది దాతలు తమ స్థలాన్నే పార్కుల నిర్వహణ కోసం దానం చేశారు. అలాంటి పార్కులు సైతం నిర్వహణ లేక, దాతలే దగ్గరుండి పరిరక్షించాల్సి వస్తోంది. మొక్కలకు నీళ్లు పట్టేవాళ్లు లేరు. ప్రమాదకరమైన గడ్డి మొక్కలు ఎక్కువవుతున్నాయి. బల్లులు విరిగిపోయాయి. పెద్దలు కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి సరైన సౌరర్యాలు లేవు. శుభ్రం చేసేవాళ్లు, పార్కులో ఏం జరిగినా అడిగేవాళ్లు లేకపోవడం చాలా దుర్భరం.' -నాగేశ్వరరావు, విజయవాడ

YSRCP Has Neglected the Modernization of Parks in Vijayawada : పార్కుల్లో సమస్యలపై వీఎంసీ ఇప్పటికైనా దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. పార్కుల చుట్టూ ప్రహరీలు నిర్మించి గేట్లు ఏర్పాటుతో పాటు చిన్నారులకు ఆటవస్తువులు సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అభివృద్ధికి నోచని ఎన్టీఆర్‌ నెక్లెస్‌ రోడ్డు - అసాంఘిక కార్యకలాపాలకు నిలయం

విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు

Last Updated : Aug 19, 2024, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.