ETV Bharat / state

కడప జిల్లాలో దారుణం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్‌ఏ హత్య - Detonators Blast in YSR District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

VRA Died in Kadapa District : వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లిలో వీఆర్‌ఏ ఇంట్లో డిటోనేటర్లు పేలాయి. వారు నిద్రిస్తుండంగా ఓ దుండగుడు వారి మంచం కింద డిటోనేటర్లు ఏర్పాటు చేసి పేల్చాడు. ఈ ఘటనలో వీఆర్ఏ మృతిచెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Detonator Blast in YSR District
Detonators Blast in YSR District (ETV Bharat)

Detonators Blast in YSR District : వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొత్తపల్లి గ్రామం శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో బాంబు మోతలు విని వారు భయకంపితులయ్యారు. వీఆర్​ఆర్​ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వెేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.గనుల్లో ఉపయోగించే డిటోనేర్లు బ్యాటరీ సాయంతో పేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు బాబు, నరసింహల మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. మృతుడి భార్యతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో నరసింహ అతడితో తరచూ గొడవలకు దిగేవారని చెప్పారు.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT

Detonators Blast in YSR District : వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొత్తపల్లి గ్రామం శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో బాంబు మోతలు విని వారు భయకంపితులయ్యారు. వీఆర్​ఆర్​ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహ అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వెేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.గనుల్లో ఉపయోగించే డిటోనేర్లు బ్యాటరీ సాయంతో పేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు బాబు, నరసింహల మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. మృతుడి భార్యతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో నరసింహ అతడితో తరచూ గొడవలకు దిగేవారని చెప్పారు.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.