ETV Bharat / state

పోలీసులపైనే దాడికి యత్నించిన రౌడీ మూక - హైదరాబాద్​లో కలకలం - Gang Attack On Police - GANG ATTACK ON POLICE

Gang Attack On Police : పోలీసులపై ఓ రౌడీ మూక కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించిన ఘటన హైదరాబాద్​లో కలకలం రేపింది. ఓ కేసు విషయమై వెళ్లిన వారిపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గండిపేట బృందావన్‌ కాలనీలో జరిగింది.

gang_attack_on_police
gang_attack_on_police (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 5:09 PM IST

Gang Attack On Police : హైదరాబాద్​లో రౌడీ మూకల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసులపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గండిపేట బృందావన్‌ కాలనీలో జరిగింది. అనంతరం నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ జరిగింది : ఓ కిడ్నాప్​ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నగరంలోని గండిపేట బృందావన్‌ కాలనీకి వెళ్లారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించింది ఆ రౌడీ మూక. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు, స్టేషన్‌కు సమాచారం ఇచ్చి అదనపు బలగాలను రప్పించారు. దీంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. వారిని చూసి పరారయ్యేందుకు రౌడీలు యత్నించారు. పారిపోతున్న వారిలో నలుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

డోన్​లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack

ఈ నెల 10న నరేందర్​, ప్రవీణ్​ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్​నకు గురయ్యారు. కిడ్నాపర్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలాన్ని కబ్జా చేసి, తమను కిడ్నాప్​ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 కోట్ల విలువైన వీరి స్థలంలో రౌడీ మూకలు తిష్టవేశారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రౌడీలకు ఉప్పర్​పల్లి కోర్టు శుక్రవారం ఏడు రోజుల రిమాండ్ విధించింది. నరేందర్​, ప్రవీణ్​ను ఇటీవల ఇదే గ్యాంగ్​ కిడ్నాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బుల్లెట్​ కలకలం : మరో ఘటనలో నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో బుల్లెట్​ కలకలం రేపింది. తమ ఇంట్లోకి బుల్లెట్​ దూసుకువచ్చిందని యజమాని వెల్లడించారు. బుల్లెట్‌ చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

రాష్ట్ర భవిష్యత్​పై సర్కార్​ ఫోకస్​ - ఏపీకి డిప్యూటేషన్​పై ఇద్దరు అధికారులు - Deputation IAS officers to AP

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - ఆత్మహత్య చేసుకుంటున్నా'- తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates

Gang Attack On Police : హైదరాబాద్​లో రౌడీ మూకల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసులపై రౌడీలు దాడికి యత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గండిపేట బృందావన్‌ కాలనీలో జరిగింది. అనంతరం నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ జరిగింది : ఓ కిడ్నాప్​ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నగరంలోని గండిపేట బృందావన్‌ కాలనీకి వెళ్లారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడికి యత్నించింది ఆ రౌడీ మూక. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు, స్టేషన్‌కు సమాచారం ఇచ్చి అదనపు బలగాలను రప్పించారు. దీంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. వారిని చూసి పరారయ్యేందుకు రౌడీలు యత్నించారు. పారిపోతున్న వారిలో నలుగురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు.

డోన్​లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack

ఈ నెల 10న నరేందర్​, ప్రవీణ్​ అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్​నకు గురయ్యారు. కిడ్నాపర్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. తమ స్థలాన్ని కబ్జా చేసి, తమను కిడ్నాప్​ చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 కోట్ల విలువైన వీరి స్థలంలో రౌడీ మూకలు తిష్టవేశారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రౌడీలకు ఉప్పర్​పల్లి కోర్టు శుక్రవారం ఏడు రోజుల రిమాండ్ విధించింది. నరేందర్​, ప్రవీణ్​ను ఇటీవల ఇదే గ్యాంగ్​ కిడ్నాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బుల్లెట్​ కలకలం : మరో ఘటనలో నార్సింగి పరిధిలోని బైరాగిగూడలో బుల్లెట్​ కలకలం రేపింది. తమ ఇంట్లోకి బుల్లెట్​ దూసుకువచ్చిందని యజమాని వెల్లడించారు. బుల్లెట్‌ చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. దీంతో ఇంటి యజమాని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

రాష్ట్ర భవిష్యత్​పై సర్కార్​ ఫోకస్​ - ఏపీకి డిప్యూటేషన్​పై ఇద్దరు అధికారులు - Deputation IAS officers to AP

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - ఆత్మహత్య చేసుకుంటున్నా'- తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.