ETV Bharat / press-releases

తెలుగు భాషోత్సవం- గిడుగు స్ఫూర్తిని అందుకోలేకపోతున్న యువతరం - telugu language day celebrations

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 3:53 PM IST

TELUGU LANGUAGE DAY : సమాజ మనుగడకు భాష ప్రాణం. మనుషుల్ని- మనసుల్ని ఏకం చేసే వారధి. సాంస్కృతిక వారసత్వానికి పట్టుగొమ్మ. చరిత్ర గమనానికి దిక్సూచి. భాషలేనిదే మనిషికి ఉనికే ఉండదు. అందుకే మన భాషను మనం కాపాడుకోవాలి. భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలి. యునెస్కో ప్రకటించిన మృతభాషల జాబితా నుంచి తెలుగు మాయం కావాలి. అప్పుడే భాషకు జవం జీవం.

telugu_language_day_at_tummalapalli_kalakshetram_vijayawada
telugu_language_day_at_tummalapalli_kalakshetram_vijayawada (ETV Bharat)

Telugu Language Day at Tummalapalli Kalakshetram Vijayawada : ఏ ప్రాంతం ఉనికైనా అక్కడి భాషపై ఆధారపడి ఉంటుంది. అందుకే మాతృ భాషను పరమళింపజేయాలి. భాషాభివృద్ధితో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం ఉంటుంది. కవులు, రచయితలు, ఉపాధ్యాయులు ఇందుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. బిడ్డ శరీరానికి తల్లి పాలు ఎంత అవసరమో, మనోవికాసానికి మాతృభాష అంతే అవసరం. శిశువు తన తొలి పాఠాన్ని తల్లి దగ్గరే నేర్చుకుంటుంది. బిడ్డలపై విదేశీ భాషను రుద్దడం మాతృదేశానికి ద్రోహం చేయడమే అవుతుంది.

ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్ధులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్లం బోధిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చేర్పిస్తున్నారు. యువతరంలో అధికశాతం మందికి తెలుగు భాష రాయడం, చదవడం కూడా రావడం లేదు. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. గ్రాంథిక భాషపై పోరాడి, విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యావహారిక భాష వ్యాప్తికి ఉద్యమం లేవనెత్తిన ధీశాలి గిడుగు. భాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చేయడంలో ఆయన కృషి అనితర సాధ్యం. ఆ స్ఫూర్తిని యువతరం అందుకోలేకపోతోందనేది భాషాభిమానుల ఆవేదన.

తెలుగు భాషకు వన్నెతెచ్చిన గిడుగు బాటలోనే పయనిస్తున్నామా - మరి లోపం ఎవరిది? - Telugu Language Day 2024


'తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు ఏ భాషలోనూ లేవు. అందుకే తెలుగు అజంతభాష. అజరామరమైన భాష. సాహితీదైనందిని పేరిట ఓ భాషాభిమానిగా ప్రత్యేకంగా ఓ క్యాలెండర్ రూపొందించాను. ఇది 12 నెలలకు సంబంధించినది. దీనిలో ప్రతీ తేదీకి పక్కన ఆ తారీకున జన్మించిన లేదా మరణించిన సాహితీవేత్తల ఫొటో ఉంటుంది. దాని కింద వారికి సంబంధించిన విషయాలు, గొప్పతనాన్ని సంక్షిప్తంగా రెండు లైన్లలో పొందుపర్చాను. దీని ముఖ్య ఉద్దేశ్యం ముందు తరాలకు వీరి గురించి తెలియజేయడం, భాషను బతికించడమే.' -కప్పగంతు రామకృష్ణ, తెలుగు అధ్యాపకుడు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం మూడు గంటలకు సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిధిగా తెలుగుభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్ధకత చేకూరుతుందని అన్నారు.

తేనెలొలుకు తెలుగుకు వేడుకలు - తొలి తెలుగు శాసన గ్రామంలో మాతృభాష దినోత్సం - Telugu Language Day Celebrations

Telugu Language Day at Tummalapalli Kalakshetram Vijayawada : ఏ ప్రాంతం ఉనికైనా అక్కడి భాషపై ఆధారపడి ఉంటుంది. అందుకే మాతృ భాషను పరమళింపజేయాలి. భాషాభివృద్ధితో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం ఉంటుంది. కవులు, రచయితలు, ఉపాధ్యాయులు ఇందుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. బిడ్డ శరీరానికి తల్లి పాలు ఎంత అవసరమో, మనోవికాసానికి మాతృభాష అంతే అవసరం. శిశువు తన తొలి పాఠాన్ని తల్లి దగ్గరే నేర్చుకుంటుంది. బిడ్డలపై విదేశీ భాషను రుద్దడం మాతృదేశానికి ద్రోహం చేయడమే అవుతుంది.

ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్ధులు ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు. ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్లం బోధిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చేర్పిస్తున్నారు. యువతరంలో అధికశాతం మందికి తెలుగు భాష రాయడం, చదవడం కూడా రావడం లేదు. గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. గ్రాంథిక భాషపై పోరాడి, విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యావహారిక భాష వ్యాప్తికి ఉద్యమం లేవనెత్తిన ధీశాలి గిడుగు. భాషను సరళీకరించి అందరికీ అర్థమయ్యేలా చేయడంలో ఆయన కృషి అనితర సాధ్యం. ఆ స్ఫూర్తిని యువతరం అందుకోలేకపోతోందనేది భాషాభిమానుల ఆవేదన.

తెలుగు భాషకు వన్నెతెచ్చిన గిడుగు బాటలోనే పయనిస్తున్నామా - మరి లోపం ఎవరిది? - Telugu Language Day 2024


'తెలుగు భాషలో ఉన్నన్ని ప్రక్రియలు ఏ భాషలోనూ లేవు. అందుకే తెలుగు అజంతభాష. అజరామరమైన భాష. సాహితీదైనందిని పేరిట ఓ భాషాభిమానిగా ప్రత్యేకంగా ఓ క్యాలెండర్ రూపొందించాను. ఇది 12 నెలలకు సంబంధించినది. దీనిలో ప్రతీ తేదీకి పక్కన ఆ తారీకున జన్మించిన లేదా మరణించిన సాహితీవేత్తల ఫొటో ఉంటుంది. దాని కింద వారికి సంబంధించిన విషయాలు, గొప్పతనాన్ని సంక్షిప్తంగా రెండు లైన్లలో పొందుపర్చాను. దీని ముఖ్య ఉద్దేశ్యం ముందు తరాలకు వీరి గురించి తెలియజేయడం, భాషను బతికించడమే.' -కప్పగంతు రామకృష్ణ, తెలుగు అధ్యాపకుడు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం మూడు గంటలకు సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిధిగా తెలుగుభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేద్దామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అప్పుడే తెలుగు భాషా దినోత్సవానికి సార్ధకత చేకూరుతుందని అన్నారు.

తేనెలొలుకు తెలుగుకు వేడుకలు - తొలి తెలుగు శాసన గ్రామంలో మాతృభాష దినోత్సం - Telugu Language Day Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.