ETV Bharat / politics

బీసీలకు అండ దండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 'డిక్లరేషన్‌'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 7:18 AM IST

TDP-Janasena To Announce BC Declaration: బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తెలుగుదేశం - జనసేన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాయి. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా తెచ్చిన ఈ డిక్లరేషన్‌లో అనేక కీలక అంశాలు ఉన్నాయి.వెనుకబడిన వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛనుతో పాటు దాన్ని 4 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. అదే విధంగా చంద్రన్న బీమా కింద 10 లక్షలు, స్వయం ఉపాధి కింద 10 వేల కోట్ల ఆర్థిక సాయం, పెళ్లికానుక కింద లక్ష సాయం అందించడంతో పాటు అనేక ఇతర హామీలను పొందుపరిచారు.

TDP_Janasena_To_Announce_BC_Declaration
TDP_Janasena_To_Announce_BC_Declaration
బీసీలకు అండదండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా డిక్లరేషన్‌

TDP-Janasena To Announce BC Declaration : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన 'జయహో బీసీ (Jayaho BC)' సభలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్‌ విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా మొత్తం పది ప్రధాన అంశాలతో ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెలుగుదేశం దాన్ని డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్‌ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించారు.

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌': చంద్రబాబు

TDP Janasena Alliance : బీసీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. పెళ్లికానుక పునరుద్ధరించి లక్ష చొప్పున అందజేస్తామని తెలిపాయి. బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా 30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో లక్షా 50 వేల కోట్ల ఖర్చుచేస్తామని వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 75 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించిందని ఆరోపించాయి. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేస్తామని తెలిపాయి. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చాయి. జనాభా తక్కువగా ఉండి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని బీసీ వర్గాలవారికి కో ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

బీసీల ఆర్థికాభివృద్ధి,ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరిస్తామని స్వయం ఉపాధి కల్పనకు అయిదేళ్లలో 10 వేల కోట్లు ఇస్తామని తెలిపాయి. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధుల కేటాయిస్తామని వెల్లడించాయి. ఆదరణ పథకం పునరుద్ధరించి 5 వేల కోట్లతో పరికరాల పంపిణీ చేస్తామని ప్రకటించాయి.జగన్‌ రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరించి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉమ్మడి వర్క్‌షెడ్లు, ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి.

చట్టబద్ధంగా కులగణన జరిపిస్తామని శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని విద్యా పథకాల పునరుద్ధరిస్తామని తెలిపాయి. విదేశీ విద్యా పథకం షరతులు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. పీజీ విద్యార్థులకూ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. స్టడీ సర్కిల్‌, విద్యోన్నతి పథకాల పునఃప్రారంభిస్తామని తెలిపాయి. ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించాయి.

వైసీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు: పవన్ కల్యాణ్​

బీసీలకు అండదండ టీడీపీ, జనసేన జెండా - బలహీనవర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా డిక్లరేషన్‌

TDP-Janasena To Announce BC Declaration : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన 'జయహో బీసీ (Jayaho BC)' సభలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్‌ విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా మొత్తం పది ప్రధాన అంశాలతో ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెలుగుదేశం దాన్ని డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్‌ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించారు.

బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్‌': చంద్రబాబు

TDP Janasena Alliance : బీసీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. పెళ్లికానుక పునరుద్ధరించి లక్ష చొప్పున అందజేస్తామని తెలిపాయి. బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా 30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో లక్షా 50 వేల కోట్ల ఖర్చుచేస్తామని వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 75 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించిందని ఆరోపించాయి. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేస్తామని తెలిపాయి. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చాయి. జనాభా తక్కువగా ఉండి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని బీసీ వర్గాలవారికి కో ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి.

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ - 10 అంశాలతో టీడీపీ-జనసేన 'బీసీ డిక్లరేషన్'

బీసీల ఆర్థికాభివృద్ధి,ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరిస్తామని స్వయం ఉపాధి కల్పనకు అయిదేళ్లలో 10 వేల కోట్లు ఇస్తామని తెలిపాయి. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు చేసి దామాషా ప్రకారం నిధుల కేటాయిస్తామని వెల్లడించాయి. ఆదరణ పథకం పునరుద్ధరించి 5 వేల కోట్లతో పరికరాల పంపిణీ చేస్తామని ప్రకటించాయి.జగన్‌ రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరించి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఉమ్మడి వర్క్‌షెడ్లు, ఫెసిలిటేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి.

చట్టబద్ధంగా కులగణన జరిపిస్తామని శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని విద్యా పథకాల పునరుద్ధరిస్తామని తెలిపాయి. విదేశీ విద్యా పథకం షరతులు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. పీజీ విద్యార్థులకూ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. స్టడీ సర్కిల్‌, విద్యోన్నతి పథకాల పునఃప్రారంభిస్తామని తెలిపాయి. ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించాయి.

వైసీపీ పాలనలో 300 మంది బీసీలను చంపేశారు: పవన్ కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.