తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2019, 6:30 PM IST

ETV Bharat / state

'ప్రభుత్వానికి ప్రజలకు వారథిలా పనిచేయాలి'

నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి వారధులుగా పని చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు పిలుపునిచ్చారు.

'ప్రభుత్వానికి ప్రజలకు వారథిలా పనిచేయాలి'

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మొహమ్మద్ ఫరీదుద్దీన్​ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు సాయం అందేలా చూడాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

'ప్రభుత్వానికి ప్రజలకు వారథిలా పనిచేయాలి'

ఇదీ చూడండి : అప్పు పుట్టని దైన్యం... ఆర్టీసీ కార్మికుల జీవితం దయనీయం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details