రాష్ట్రంలోని అన్ని కుల వృత్తుల వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. మత్స్యకారులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లోని మత్స్యకారులకు చేపపిల్లల్ని పంపిణీ చేశారు. మెట్పల్లిలో లక్షా20వేలు, కోరుట్లలో 30వేల చేపపిల్లలను చెరువులో వదిలారు.
'అన్ని కుల వృత్తులవారిని ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యం'
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లోని మత్స్యకారులకు చేపపిల్లల్ని ఎమ్మెల్యే విద్యాసాగర్ పంపిణీ చేశారు. మెట్పల్లిలో లక్షా 20వేలు, కోరుట్లలో 30వేల చేపపిల్లలను చెరువులో వదిలారు.
mla vidyasagar distributed fish in metpally and korutla
ప్రభుత్వం అందిస్తున్న చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని... రానున్న రోజుల్లో మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారులకు ఉన్న మిగితా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.