జగిత్యాల జిల్లా పొలాస గ్రామ మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మహిళా సంఘ సభ్యులను గ్రామ సీఏలు మోసం చేస్తున్నారని.. వారిని తొలగించాలని ఆందోళనకు దిగారు. బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ. రెండు వేలు తీసుకుని పొదుపు ఖాతా లెక్కలు సరిగా చూపట్లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసకోవాలని కోరారు. జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని శాంతింపజేయడం వల్ల మహిళలు ఆందోళనను విరమించారు.
పొదుపు ఖాతాల్లో అక్రమాలపై మహిళల ఆందోళన
మహిళా సంఘ సభ్యులను గ్రామ సీఏలు మోసం చేస్తున్నారని జగిత్యాల జిల్లా పొలాస మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రహదారిపై మహిళల ఆందోళన
TAGGED:
ladies protest