దొంగతనం కేసులో జైలుకెళ్లొచ్చి మళ్లీ అదే పని చేస్తున్న వారిపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. నాంపల్లి ఆగాపురాకు చెందిన మహ్మద్ సైఫుద్దీన్, షేక్ ఇమ్రాన్, మహ్మద్ షరీఫ్ అలీ ముగ్గురు కలిసి రాయ్కల్ గ్రామంలోని వాహనాల టైర్లు పంక్చర్ వేసే దుకాణం యజమానిని బెదిరించి విలువైన చరవాణి, మూడు వేల రూపాయలు దోపిడీ చేశారు.
వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిపై పీడీయాక్ట్
వరుస దోపిడీలకు పాల్పడుతున్న నేరగాళ్లపై సైబరాబాద్ పోలీసులు పీడీ చట్టం నమోదు చేశారు. జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోకపోవడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నేర వార్తలు
మొత్తం రూ.23 వేలు విలువైన మూడు ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుల్లో వారు ముగ్గురు జైలుకెళ్లి వచ్చారు. అయినప్పటికీ దోపిడీలు చేస్తునే ఉండడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వారి ముగ్గురిపై పీడీ చట్టం నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదీ చూడండి:యాంటీ ఫంగల్ ఔషధాలకు నిపుణుల కమిటీ అనుమతి తప్పనిసరి