హైదరాబాద్ హైదర్గూడలో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గృహ సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17న ఏరువాక పౌర్ణని పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో... శాస్త్రోక్తంగా గృహ, వాస్తు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లకు ముహూర్తం ఖరారు - vemula prashanth reddy
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆధునిక హంగులతో కొత్త ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 17న సభాపతితో కలిసి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కొత్త ఇళ్లు