తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటి కోసం మహిళల ధర్నా

అందరూ కరోనా భయంతో ఉంటే.. ఓ చోట తాగునీటి కోసం ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా లక్కారంలోని కేబీనగర్ మహిళాలు గ్రామపంచాయతీ ముందు తాగు నీటి కోసం ధర్నా నిర్వహించారు.

By

Published : Apr 11, 2020, 7:12 PM IST

ladies protest for drinking water in adilabad district
తాగునీటి కోసం మహిళాల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారంలోని కేబీనగర్ వాసులు తాగునీటి కోసం గ్రామపంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు. మహిళలు ఖాళీ బిందెలు నెత్తిన పెట్టుకొని గ్రామపంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు.

వెంటనే నీటి సమస్య తీర్చాలని లేకుంటే ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రెండు మూడు రోజుల్లో చేతి పంపు అమర్చటంతోపాటు బోర్ వెల్ బాగు చేయిస్తామని సర్పంచ్​ హామీ ఇవ్వగా మహిళలు నిరసన విరమించారు.

ఇదీ చూడండి:టీ కొవిడ్- 19 యాప్​ను ఆవిష్కరించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details