టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2021) సెమీస్కు ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై (SL Vs WI) 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్ సెమీస్ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
T20 World Cup: లంక ఘన విజయం.. విండీస్ ఇంటికే!
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2021) వెస్టిండీస్తో మ్యాచ్లో శ్రీలంక చెలరేగిపోయింది. విండీస్పై (SL Vs WI) 20 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. చరిత్ అసలంక (68:8 ఫోర్లు, ఒక సిక్స్), నిస్సాంక (51: ఐదు ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. కుశాల్ పెరీరా (29: రెండు ఫోర్లు, ఒక సిక్స్), డాసెన్ శనక (25*: రెండు ఫోర్, ఒక సిక్స్) రాణించారు. కీలకమైన మ్యాచ్లో లంకపై వెస్టిండీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విండీస్ బౌలర్లలో రస్సెల్ 2, బ్రావో ఒక వికెట్ తీశారు.
ఇదీ చూడండి:బంగ్లాపై ఆస్ట్రేలియా ఘన విజయం.. సెమీస్కు మరింత చేరువగా