తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2020, 5:53 PM IST

ETV Bharat / jagte-raho

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నుంచి కిలో 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కుమురంభీం జిల్లాలోని ఉట్నూరులో ధనోరాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి.. తీసుకొని వస్తుండగా ఎస్సై మానస పట్టుకున్నారు.

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నుంచి కిలో 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తాండూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామానికి చెందిన భీంరావు, మాదారం ఐదో ఇంక్లైన్​కి చెందిన మడావి రాంచందర్ రావులు ఇద్దరు కలిసి కుమురంభీం జిల్లాలోని ఉట్నూరులో ధనోరాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద 1.250కిలోల గంజాయిని కొనుగోలు చేసి.. తీసుకొని వస్తుండగా ఎస్సై మానస పట్టుకున్నారు.

సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ కె. బాబూరావు అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:ఆ కేఫ్​లో గంజాయి కలిపిన బీరుకు సూపర్​ క్రేజ్​!

ABOUT THE AUTHOR

...view details