బీమా క్లెయింలను వేగంగా పరిష్కరించేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పాలసీదారుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పాలసీదారులు కొవిడ్-19తో ఆసుపత్రిలో మరణించినప్పుడు.. మున్సిపల్ మరణ ధ్రువీకరణ స్థానంలో ప్రభుత్వ, ఈఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్, కార్పొరేట్ ఆసుపత్రులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ, డిశ్చార్జి సమ్మరీ, డెత్ సమ్మరీలో తేదీ, సమయంతో పాటు ఉన్న పత్రాలపై ఎల్ఐసీ క్లాస్ 1 ఆఫీసర్ సంతకం చేయించి, క్లెయిం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు దహనం/ఖననం జరిగిన చోట నుంచి ఇచ్చిన ధ్రువీకరణా చెల్లుతుంది. ఇతర మరణాలకు సంబంధించి మున్సిపల్ డెత్ సర్టిఫికెట్ గతంలాగానే అవసరం ఉంటుంది.
వీడియోకాల్ ద్వారానూ..