కరోనా నేపథ్యంలో ఖాజానాను పొదుపుగా వాడుకునే ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020-21) యూరియాయేతర ఎరువులపై రాయితీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రాయితీ కోతతో ప్రభుత్వ ఖజానాపై రూ.22,186.55 కోట్ల భారం తగ్గే అవకాశముందని అంచనా.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాయితీలు ఇలా..
ఎరువు (కిలోకు) | 2020-21కి | 2019-20లో |
నైట్రోజన్ | రూ.18.78 | రూ.18.90 |
పాస్పరస్ | రూ.14.88 | రూ.15.21 |
పొటాష్ | రూ.10.11 | రూ.11.12 |
సల్ఫర్ | రూ.2.37 | రూ.3.56 |