తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దక్షిణాదిన 'వయనాడ్'​ స్థానమే ఎందుకు?

వయనాడ్​..కేరళలోని ఓ జిల్లా. ప్రస్తుతం ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ లోక్​సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయడమే. అసలు రాహుల్​ వయనాడ్​ నుంచి బరిలోకి దిగడానికి కారణమేంటి?

By

Published : Apr 1, 2019, 6:43 AM IST

Updated : Apr 1, 2019, 1:34 PM IST

దక్షిణాదిన 'వయనాడ్'​ స్థానమే ఎందుకు?

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఈ లోక్​సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచీ పోటీ చేస్తారని ఊహాగానాలొచ్చాయి. ఎట్టకేలకు కేరళలోని వయనాడ్​ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

సాధారణంగా రాహుల్​ ప్రతిసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేస్తారు. అయితే ఈ సారి దక్షిణాది నుంచి పోటీ చేయడం వెనుక బలమైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాదిన పార్టీని బలమైన శక్తిగా మార్చడమే ఈ నిర్ణయం వెనుక కారణమా?

మరో కంచుకోట..!

2009లో వయనాడ్​ పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది. అక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్​దే గెలుపు. 2009లో లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్ (ఎల్​డీఎఫ్​)​ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్​ పార్టీ నుంచి ఎమ్​ఐ షానవాస్​ గెలిచారు. 2014లో కూడా కాంగ్రెస్​-యూడీఎఫ్​ పొత్తులో భాగంగా ఈయనే తిరిగి ఎన్నికయ్యారు.

ఈసారీ యూడీఎఫ్​తో కలిసే కేరళలో పోటీ చేస్తోంది కాంగ్రెస్​. ఎల్​డీఎఫ్​ నుంచి పీపీ సునీర్​ బరిలో ఉన్నారు. ఎన్డీఏ తరఫున భారత ధర్మ జన సేన (బీడీజేఎస్​) పార్టీ పోటీలో ఉంది. ఇంతవరకు ఈ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రాహుల్​ గాంధీకి దీటైనా ప్రత్యర్థిగా ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్​ గోపీని బరిలోకి దించే అవకాశం ఉంది.

వయనాడ్​ ప్రత్యేకతలు..

వయనాడ్​లో కాఫీ, టీ, కోకో, పెప్పర్​ పంటలు అధికంగా పండిస్తారు. ఈ ప్రాంతలోని ఎడక్కల్​ గుహలు, ఆకర్షణీయ ప్రదేశాలు, సెలయేళ్లు పర్యటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 13,25,788. మహిళా ఓటర్లు 6,70,002. ఇక్కడ రైతుల సంఖ్య అధికంగానే ఉంది. ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ.

కాంగ్రెస్​కు కొత్త కాదు..

దక్షిణాది నుంచి కాంగ్రెస్​ అగ్రనాయకులు బరిలోకి దిగడం ఇది మొదటిసారి కాదు. గతంలో రాహుల్​ గాంధీ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కర్ణాటకలోని చికమంగళూరు నుంచి పోటీ చేశారు. అలాగే కర్ణాటకలోని బళ్లారి లోక్​సభ స్థానంలో కాంగ్రెస్​మాజీఅధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంతకుముందు ఓ సారి బరిలోకి దిగారు. ఇప్పుడు రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్​ స్థానాన్ని ఎంచుకున్నారు.

Last Updated : Apr 1, 2019, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details