తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్రమంగా భారత్​లో ప్రవేశించిన పాక్​ జాతీయుడి అరెస్టు

అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్​ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్​ అలీగా గుర్తించారు. అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు.

By

Published : Sep 22, 2019, 6:35 AM IST

Updated : Oct 1, 2019, 1:02 PM IST

అక్రమంగా భారత్​లో ప్రవేశించిన పాక్​ జాతీయుడి అరెస్టు

జమ్ము కశ్మీర్​లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్​కోట్​కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

"అలీ పాకిస్థాన్​ నుంచి అక్రమంగా కశ్మీర్​...​ ఆర్​ఎస్​ పుర సెక్టార్​లోని​ చందుచౌక్​ గ్రామంలో ప్రవేశించాడు. అతనిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అలీ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. "
- పోలీసు అధికారి

భారత్​లోకి అనుమానితుడి అక్రమ చొరబాటుపై... పోలీసులు విచారణ చేపట్టారు.

ఆర్టికల్ 370 రద్దుతో

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దు చేసింది. దీనిని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ దాడులు చేస్తోంది. జమ్ము కశ్మీర్​లో అశాంతి రగిల్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అక్రమంగా భారత్​లోకి చొరబాటుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతాదళాలు ముష్కరుల పన్నాగాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానితుడి రాక కొద్ది సేపటి వరకు ఆందోళన కలిగించింది.

ఇదీ చూడండి: పాక్​ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి

Last Updated : Oct 1, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details