సింగపూర్లో ఏప్రిల్ చివరి నాటికి 4వేల 800మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు సోకింది. వారిలో 90శాతం మంది ఆ దేశంలోని విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన డార్మిటరీల్లో ఉన్నవారే అని సింగపూర్లోని భారత హై కమిషనర్ జావెద్ అష్రఫ్ తెలిపారు. అయితే వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. డార్మిటరీల్లో పరీక్షలు విస్తృతంగా జరుగుతున్నట్టు.. వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు.
అయితే ఏప్రిల్ మధ్య వారాలతో పోల్చితే.. చివరి నాటికి డార్మిటరీల్లోని రోజువారీ కేసుల సగటు తగ్గిందని భారత హై కమిషనర్ స్పష్టం చేశారు.
వైరస్తో ఇప్పటి వరకు ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరికి హృద్రోగ సమస్యలున్నాయి. మరొకరు వైరస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి సుసైడ్ చేసుకున్నారు. భారత్లో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సేవలు లేనందును వారిని సింగపూర్లోనే ఖననం చేశారు.
హై కమిషన్ సేవలు...