తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2019, 3:30 PM IST

ETV Bharat / bharat

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- 5% డీఏ పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కరువు భత్యం, రైతులకు పెట్టుబడి సాయం కోసం ఆధార్​ అనుసంధానం, జమ్ముకశ్మీర్​లో ఆశ్రయం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే విషయంపై పలు ప్రతిపాదనలు ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక- 5% డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సహా వివిధ వర్గాలకు కేంద్ర సర్కార్‌ దీపావళి కానుక అందించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 5శాతం పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మూలవేతనంలో ప్రస్తుతం 12శాతం ఉన్న కరవు భత్యం... పెంపు తర్వాత 17శాతానికి పెరగనుంది. ఈ నిర్ణయం ద్వారా 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.

" కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ధరల పెరుగుదల భత్యంతో ముడిపడిన కరవు భత్యం 5శాతం పెరిగింది. గత అనేక సంవత్సరాల్లో కరవు భత్యం కేవలం 2 లేదా 3శాతం మాత్రమే పెరుగుతూ ఉండేది. పెరిగిన కరవు భత్యం కోసం 16వేల కోట్ల రూపాయలను అందజేస్తాం. పెంపు వల్ల 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పింఛనుదారులకు మేలు జరుగుతుంది. ఇది చక్కని దీపావళి కానుక. ఈ పెంపును అంతా స్వాగతిస్తారని నమ్ముతున్నా."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.

నవంబర్​ 30 వరకు పొడగింపు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న 6వేల రూపాయల పెట్టుబడి సాయం పొందేందుకు.. బ్యాంకు ఖాతాలను ఆధార్​తో అనుసంధానించే గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఇప్పటికే 7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు జావడేకర్​.

ఆర్థిక సాయం..

జమ్ముకశ్మీర్​లో ఆశ్రయం కోల్పోయిన సుమారు 5,300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5,50,00 పరిహారం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

ఆశావర్కర్ల వేతనాలను వెయ్యి రూపాయల నుంచి 2వేల రూపాయలకు పెంచింది.

ఇదీ చూడండి: 11న భారత్​కు జిన్​పింగ్​- డ్రాగన్​తో మైత్రి దృఢమయ్యేనా?

ABOUT THE AUTHOR

...view details