మమకారంతో పసుపు సాగు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన బక్క రైతుల బతుకులు ఎండబారి పోతున్నాయి. ధరలు పతనమై కర్షకుల కలలు కరిగిపోతున్నాయి. కడప జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్లో 33 మండలాల్లో సుమారు 10,487.65 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా వేశారు. మైదుకూరు మండలంలో అత్యధికంగా 2,446.55 ఎకరాల్లో సాగుచేయగా.. దువ్వూరు, ఖాజీపేట, చాపాడు, చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట, సిద్దవటం, పోరుమామిళ్ల, పుల్లంపేట, మైలవరం, జమ్మలమడుగు, పెండ్లిమర్రి, కాశినాయన, నందలూరు, చెన్నూరు, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, రాజుపాలెం, వల్లూరు, ప్రొద్దుటూరు, కలసపాడు, చిట్వేలి, బ్రహ్మగారిమఠం మండలాల్లోనూ పంట సాగుచేస్తున్నారు. నెలరోజులుగా పసుపు తవ్వకం పనులు జరుగుతున్నాయి. పచ్చి కొమ్ములను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తే చూపడం లేదు.
కరోనా ఎఫెక్ట్