కరోనాతో మృతి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్రపటానికి కడప ప్రెస్ క్లబ్ లో బీజేవైఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ మనిషిగా ఉంటూ అందరి మనన్నలు పొందిన మాణిక్యాలరావు మృతి పార్టీకి తీరని లోటని బీజెవైఎం నాయకులు రమేష్ నాయుడు అన్నారు. మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారని పేర్కొన్నారు. మాణిక్యాలరావు ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
మాణిక్యాలరావుకు నివాళులు అర్పించిన బీజేవైఎం నాయకులు
కడపలో బీజేవైఎం నాయకులు మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలిపారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన మాణిక్యాలరావు మంత్రిగా ఎదిగారని పేర్కొన్నారు
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు నివాళులు అర్పించిన బీజెవైఎం నాయకులు