అధికారుల తీరుపై మండిపడ్డ భాజపా అధికార ప్రతినిధి
కడపలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటించే పరిస్థితిలో అధికారులు లేరని భాజపా అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా మాదిరిగా కడప జిల్లాను తయారు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
సమావేశంలో మాట్లాడుతున్న భాజపా అధికార ప్రతినిధి
కడప జిల్లాను కర్నూలు జిల్లాగా మారుస్తారా అని భాజపా అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ధ్వజమెత్తారు. గతంలో చెప్పిన విధంగా కడపలో 25 మంది అంతరాష్ట్ర మత ప్రచారకులను ప్రత్యేకంగా ఓ సమావేశ మందిరంలో ఉంచారని అ విషయం అందరికీ తెలుసునని అన్నారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారు అనే విషయం అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలోని కరోనా పరీక్ష కేంద్రంలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చిన విషయం అధికారులు వెల్లడించలేదని ఆయన ఆరోపించారు.