కడప జిల్లా పులివెందులలోని తెదేపా కార్యాలయంలో గత నెల 16న మాజీ అటవీ శాఖ డైరెక్టర్ పుచ్చా వరప్రసాద్ రెడ్డి కారును దగ్ధం చేసిన కేసులో ముగ్గురు తేదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ మధుసూదన్రెడ్డి, పట్టణ తెదేపా అధ్యక్షుడు మహబూబ్బాషా, ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరిని కోర్టుకు తరలించే సమయంలో కుటుంబ సభ్యులు, తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
వాహన దగ్ధం కేసులో ముగ్గురు తెదేపా నేతల అరెస్టు
కడప జిల్లా పులివెందులలో అటవీ శాఖ మాజీ అధికారి వాహనం దగ్ధం కేసులో ముగ్గురు తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో వారి బంధువులు, తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గత నెల 16న జరిగిన ఘటనలో విచారణ జరిపిన పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
తెదేపా నేతల అరెస్టు