ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 8, 2020, 12:40 PM IST

ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా..రెండు ట్రాక్టర్లు సీజ్

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. వాహన యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇసుక అక్రమ రవాణా..రెండు ట్రాక్టర్లు సీజ్ !
ఇసుక అక్రమ రవాణా..రెండు ట్రాక్టర్లు సీజ్ !

అక్రమ ఇసుక రవాణాపై కడప పోలీసులు ఉక్కుపాదం మోపారు. బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. సగిలేరు నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు. వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details