ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హక్కులు కాలరాస్తే ఊరుకోం: ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ..కార్మికుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని ఎంప్లాయిస్​ యూనియన్​ నాయకులు హెచ్చరించారు. సిబ్బందిని కుదించే ప్రయత్నాన్ని ఆర్టీసీ విరమించుకోవాలని డిమాండ్​ చేస్తూ.. కడప జిల్లా జమ్మలమడుగు డిపో వద్ద ధర్నా చేశారు. సంస్థకు వచ్చే లోటును ప్రభుత్వమే భరించాలని నినదించారు.

By

Published : May 18, 2019, 5:04 PM IST

ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

కడప జిల్లాలో ఆర్టీసీ యాజమాన్యంపై రోజురోజుకూ.. వ్యతిరేకత పెరుగుతోంది. సిబ్బందిని తగ్గించే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్​ చేస్తూ...ఎంప్లాయిస్​ యూనియన్​ జమ్మలమడుగు డిపో వద్ద ధర్నా చేసింది. కార్మిక వ్యతిరేక విధానాలతో యాజమాన్యం ఏకపక్షనిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపించారు. అద్దె బస్సులు, అవుట్​సోర్సింగ్​ ప్రతిపాదనలు మానుకోవాలన్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగినంతగా బస్సుల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు. సంస్థకు వచ్చే ఆదాయ లోటును ప్రభుత్వమే భరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details