ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఓ గర్భిణీకి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో ఆమెను కడపకు తరలించారు. జమ్మలమడుగు పట్టణానికి చెందిన దంపతులు మే 28వ తేదీన పూణె నుంచి జమ్మలమడుగు చేరుకున్నారు.
వారు ఈ నెల 3వ తేదీన జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. శనివారం సాయంత్రం భార్యకు పాజిటివ్ తేలడం వల్ల ఆమెను అంబులెన్స్లో కడపకు తరలించారు. అత్తమామలతో సహా భర్తకు నెగిటివ్ రిపోర్ట్ రావటంతో ప్రొద్దుటూరు క్వారంటైన్కు తరలించారు. జమ్మలమడుగు పట్టణంలో కరోనా పాజిటివ్ రావటంతో పోలీసు, పారిశుద్ధ్యం, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.